తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తిశ్రద్ధతో 72 ఏళ్ల వృద్ధురాలు మెట్లమార్గంలో కాలినడకన వేగంగా నడుచుకుంటూ వెళ్లడం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు యువకులు మెట్లను ఎక్కడంలో వెనుకపడిపోతుంటే, కర్ర పట్టుకుని ఆ వృద్ధురాలు ఆగకుండా ముందుకు సాగింది. ఇది చూసిన వారు ఆమె సంకల్పానికి శలాఘనలు తెలియజేస్తున్నారు.

శారీరక బలానికి మించిన మానసిక ధైర్యం
ఈ వృద్ధురాలికి ఏడాది క్రితం కాలు ఫ్రాక్చర్ అయినా, తిరుమల శ్రీవారిని దర్శించాలన్న కోరికతో ఆమె దృఢంగా నడిచింది. “ఆ పైవాడే నన్ను నడిపిస్తున్నాడు” అనే మాటలతో ఆమె సాగిన ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకం. ఇది కేవలం శారీరక శక్తి కాదని, నమ్మకం, ఆత్మవిశ్వాసమే ఆమెను నడిపించిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
నెటిజన్ల అభిప్రాయం: ప్రత్యేక దర్శనాన్ని కల్పించాలి
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వృద్ధురాలిని చూసిన నెటిజన్లు ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పించాలని సూచిస్తున్నారు. భక్తిశ్రద్ధతో నడిచి వచ్చే వారికి తిరుమల దేవస్థానం ప్రోత్సాహం ఇవ్వాలన్న వాదన పెరుగుతోంది. ఇలాంటి భక్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన మనందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉంది – వయస్సు కంటే మానసిక ధైర్యమే ముందుంటే ఏదైనా సాధ్యమే.