ఇకపై ఉబెర్ ‘అడ్వాన్స్ టిప్’ (Uber ‘Advance Tip’) వ్యవహారంపై తలనొప్పి తప్పదు. ఈ సరికొత్త విధానం పై కేంద్రం గట్టి వ్యతిరేకత వ్యక్తం చేసింది. ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్( Cab service company Uber) ఇటీవల తమ యాప్లో ప్రయాణికులకు ముందుగానే టిప్ చెల్లించే సదుపాయం (Tip payment facility) అందుబాటులోకి తెచ్చింది. “వేగంగా క్యాబ్ రావాలంటే ముందుగా టిప్ ఇవ్వండి” అన్నమాట. కానీ ఈ వ్యవహారం ప్రభుత్వానికి గట్టిగా గుచ్చుకుంది.

టిప్ కంటే దోపిడీలా ఉందన్న కేంద్ర మంత్రి
ఈ అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “టిప్ అనేది మనసు వచ్చినపుడే ఇవ్వాల్సిందే. ముందే బలవంతంగా వసూలు చేయడం అనైతికం. ఇది సూటిగా దోపిడీ కిందకే వస్తుంది,” అని ఆయన ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్) వేదికగా అన్నారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) రంగంలోకి దిగింది. ఉబెర్కు అధికారికంగా నోటీసులు జారీ ( Official notice issued to Uber) చేసి, వివరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
వినియోగదారుల హక్కుల ఉల్లంఘన?
ఉబెర్ ప్రవేశపెట్టిన ‘అడ్వాన్స్ టిప్’ విధానం వినియోగదారుల హక్కులను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. క్యాబ్ బుకింగ్ సమయంలో, “వేగంగా డ్రైవర్ రావాలంటే ముందే టిప్ ఇవ్వండి” అన్న ఆలోచన బలవంతంగా మలచినట్టు ఉన్నట్లు అనిపిస్తోంది.ప్రయాణికులు ఆ టిప్ను ఇవ్వాలన్న నిబంధన లేదని కంపెనీ చెప్తున్నా, ఈ విధానం వల్ల ఒక రకమైన ఒత్తిడి ప్రయాణికులపై పడుతోందని కేంద్రం భావిస్తోంది.
టిప్ అంటే గౌరవ సూచిక, కాదేమో బాద్యత
ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. టిప్ అనేది సేవల నాణ్యతకు గుర్తింపుగా ఇచ్చే గౌరవ సూచిక మాత్రమే. అది ముందే తీసుకోవడం అనైతికం, తప్పు అని ఆయన అన్నారు. టిప్ ఇవ్వడాన్ని ఒక రకమైన లావాదేవీగా మార్చడం సరైంది కాదు అని పేర్కొన్నారు.అంతేకాదు, వినియోగదారులతో జరిపే ప్రతి వ్యవహారంలో పారదర్శకత, న్యాయబద్ధత, సమర్ధత ఉండాలన్నారు. టిప్ విషయంలో ఈ మూడు కూడా తక్కువైపోయాయనిపిస్తోంది.ఈ దుమారం నేపథ్యంలో ఉబెర్ ఒక వివరణ ఇచ్చింది. “ముందస్తు టిప్ పూర్తిగా డ్రైవర్కే చెందుతుంది. వినియోగదారులు ఎప్పుడైనా ఆ మొత్తాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది,” అని కంపెనీ పేర్కొంది.
ఉబెర్ తీసుకున్న ఈ నిర్ణయం
అయితే ఇది చాలదని కేంద్రం భావిస్తోంది.CCPA ఈ వివరణను పరిశీలించి, అవసరమైతే గత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వినియోగదారుల ప్రయోజనాలపై ప్రభావం చూపే విధానాలను అంత సులభంగా వదిలేయమంటూ కేంద్రం స్పష్టం చేస్తోంది.ఉబెర్ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారుల్లో భిన్న స్పందనలు తీసుకురావడమే కాకుండా, ప్రభుత్వ అంగుళింతలకు దారితీసింది. టిప్ అనేది అభినందనల కోసం ఇవ్వాల్సిందే కానీ, వేగంగా క్యాబ్ రావాలంటే ముందుగానే ఇవ్వాలన్న ఆలోచన వినియోగదారుల హక్కులపై మచ్చ వేసేలా మారింది.ఈ వివాదం ఇంకా ఎటు వెళుతుందో చూడాలి. కానీ వినియోగదారుల శబ్దం వింటున్నాం అని కేంద్రం చెప్పడమే ఈ కథలో పాజిటివ్ పాయింట్.
Read Also : Chandrababu Naidu : బెంగళూరు ఎయిర్ పోర్టుపై చంద్రబాబు ఏమన్నారంటే…!