Omar Abdullah sworn in as Jammu and Kashmir CM

జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు. ఒమర్ అబ్దుల్లాతోపాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా సురేంద్ర చౌదరి ప్రమాణ స్వీకారం చేయగా.. జావేద్ దార్, సకినా ఇట్టు, జావేద్ రానా, సతీష్ శర్మలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భారత కూటమి నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సుప్రియా సూలె, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందు మీడియాతో మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా .. కొత్తగా ఏర్పాటవుతున్న తమ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. జమ్ము కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశాక.. ప్రమాణ స్వీకారం చేస్తున్న తొలి ముఖ్యమంత్రిని తానేనన్నారు. గడిచిన పదేళ్లలో జమ్ము కశ్మీర్ ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.

కాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 29, కాంగ్రెస్ కు 6, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 3, పీపుల్ కాన్ఫరెన్స్ కు 1, సీపీఐ(ఎం) 1 స్థానాల్లో గెలిచాయి. కాగా.. జమ్ము కశ్మీర్ ను కేంద్రంలో ఉన్న బీజేపీ 2019, ఆగస్టు 5న కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. జమ్ము కశ్మీర్, లడఖ్ గా విభజించి రాష్ట్రపతి పాలన విధించింది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల జరిగిన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. నలుగురు స్వతంత్రులు, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Related Posts
భైరవ అష్టమి మహోత్సవం..2024 రకాల మిఠాయిలు..84,000 చదరపు అడుగుల రంగోలీతో ప్రపంచ రికార్డు
Bhairava Ashtami Mahotsavam.2024 types of sweets.world record with 84000 square feet Rangoli

హైదరాబాద్‌: అఖిల భారతీయ బతుక భైరవ భక్త మండలి మరియు పార్శ్వ పద్మావతి శక్తి పీఠం, కృష్ణగిరి, తమిళనాడు పీఠాధిపతి డా. వసంత్ విజయ్ జీ మహారాజ్ Read more

కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ
కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ

161 ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, వన్యప్రాణుల సంరక్షణ చట్టాల కింద 38 ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ Read more

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ప్రత్యక్ష పన్ను వసూలు..
IDFC First Bank direct tax collection

ముంబై: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి ), భారత ప్రభుత్వం తరపున ప్రత్యక్ష పన్ను వసూలు చేయడానికి ఆదాయపు పన్ను పోర్టల్‌తో తమ ఏకీకరణ Read more

న్యూఇయర్ కి హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పొడిగింపు!
Hyderabad Metro

హైదరాబాద్ నగరం నూతన సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించేందుకు సిద్దమవుతుండగా, హైదరాబాద్ మెట్రో రైలు తన సేవలను డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత కూడా పొడిగించనున్నట్లు ప్రకటించింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *