हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు..

sumalatha chinthakayala
ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు..

న్యూఢిల్లీ: ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్‌ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్‌ ద్వారా వార్నింగ్‌ రావడంతో ముందుజాగ్రత్తగా స్కూళ్లను మూసివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్‌ సిబ్బంది స్కూళ్లలో తనిఖీలు చేశారు. అనంతరం అనుమానాస్పద వస్తువులేవీ లేవని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మయూర్‌ విహార్‌లోని అహ్లాకాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు ప్రిన్సిపల్‌ పాండవ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు టెలిఫోన్‌ ద్వారా తెలియజేశారని వెల్లడించారు.

image

అంతేకాక.. నోయిదాలోని శివ్‌ నాడార్‌ స్కూల్‌కు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. బాంబ్‌ స్క్వాడ్‌, ఫైర్‌ సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌ స్కూల్‌లో తనిఖీలు చేస్తున్నారని వెల్లడించారు. మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై సైబర్‌ టీమ్‌ దర్యాప్తు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి గాలివార్తలను నమ్మొద్దని నోయిడా పోలీసులు సూచించారు.

ఇకపోతే..ఢిల్లీలోని స్కూళ్లకు గతకొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారిన విషయం తెలిసిందే. గత నెల 10న స్కూళ్లకు బెదింపుల వెనక ఉన్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఓ మైన‌ర్ విద్యార్థి.. త‌న స్కూల్ ప‌రీక్ష‌ల‌ను త‌ప్పించుకునేందుకు ఆ బెదిరింపులు చేసిన‌ట్లు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870