జాతీయ గీతాన్ని అవమానించిన ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై కోర్టులో పిటిషన్ దాఖలైంది. పాట్నాలో ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ గీతం ఆలపిస్తుండగా, నవ్వుతూ పక్కన ఉన్న వారిని పలకరించిన విషయం వైరల్ అయింది. దీనిపై విపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ, ముఖ్యమంత్రి పదవికి నితీశ్ అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కోర్టులో పిటిషన్ దాఖలు
ఈ ఘటనపై ముజఫర్పూర్లోని సీజేఎం కోర్టులో శుక్రవారం న్యాయవాదులు సూరజ్ కుమార్, అజయ్ రంజన్ పిటిషన్ దాఖలు చేశారు. వారు తమ పిటిషన్లో నితీశ్ కుమార్ జాతీయ గీతాన్ని అవమానించారని, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 298, 352, జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టంలోని సెక్షన్లు 2, 3 కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణను కోర్టు మార్చి 28కి వాయిదా వేసింది. ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ప్రతిపక్షాలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని దుశించాయి. శుక్రవారం శాసనసభ, శాసనమండలిలోనూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. విపక్షాలు శనివారం బీహార్ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. ముఖ్యమంత్రి నితీశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే రాజ్ భవన్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ అంశంపై నితీశ్ కుమార్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఆయన అనుచరులు ఈ వివాదాన్ని నిరాధారమైనదిగా కొట్టిపారేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. భారతదేశంలో జాతీయ గీతాన్ని అవమానించడం శిక్షార్హ నేరంగా పరిగణించబడుతుంది. భారత శిక్షాస్మృతిలోని కొన్ని సెక్షన్ల ప్రకారం, ఇది కఠినమైన శిక్షలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ కేసు న్యాయపరంగా ఎంతవరకు ముందుకు వెళుతుందో చూడాలి. ఇది మొదటిసారి కాదు, ఇలాంటి వివాదాలు గతంలో కూడా భారతదేశంలో చోటుచేసుకున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా గతంలో ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. కర్ణాటకలోనూ కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులపై జాతీయ గీతాన్ని గౌరవించలేదనే వివాదాలు రేగాయి. అయితే, ఈ రకమైన ఆరోపణలపై కోర్టులు గతంలోనూ తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కోర్టులు నేరం నిరూపించలేదని తీర్పు ఇచ్చాయి, మరికొన్ని సందర్భాల్లో మాత్రం నిందితులకు జరిమానాలు విధించారు. ఈ వివాదంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. కొంత మంది నితీశ్పై విమర్శలు చేస్తున్నప్పటికీ, మరికొంత మంది ఇది చిన్న అంశమని, అనవసరంగా రాజకీయం చేయవద్దని సూచిస్తున్నారు. ఈ కేసు ఎలా పరిష్కారం అవుతుందో, కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి. విపక్షాలు దీన్ని మరింత వేడెక్కించే అవకాశం ఉంది.