కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్లో ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. ఇది 2025-26 బడ్జెట్కు ముందుగా విడుదలయ్యే ప్రీ-బడ్జెట్ నివేదిక. లోక్సభలో మధ్యాహ్నం 12 గంటలకు, రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదికను ప్రధాన ఆర్థిక సలహాదారుడు వి. అనంత నాగేశ్వరన్ పర్యవేక్షణలో రూపొందించారు. ఇందులో గత ఆర్థిక సంవత్సరపు విశ్లేషణతో పాటు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలు ఉంటాయి. ఈ సర్వేలో ఉల్లేఖించిన అంశాలు కేంద్ర బడ్జెట్ రూపకల్పనకు మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్సభ, రాజ్యసభల్లో విడివిడిగా ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరుగనున్నాయి. ఈ ఆర్థిక సర్వే ప్రభుత్వ ఆర్థిక విధానాలకు కీలక సూచనలుగా మారనుంది. ఇందులోని విశ్లేషణలు, గణాంకాలు, మరియు భవిష్యత్ అంచనాలు కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో ప్రభావం చూపే అవకాశం ఉంది. బడ్జెట్కు ముందు విడుదలయ్యే ఈ నివేదిక ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రస్తుత పరిస్థితి, పెరుగుదల అవకాశాలు, మరియు పాలనాపరమైన ప్రాధాన్యతలు ప్రజలకు స్పష్టతనిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక వ్యూహాలను అమలు చేయనున్నదీ ఈ సర్వే ద్వారా కొంత మేరకు అర్థం చేసుకోవచ్చు.