Nirmala Sitharaman key comments on the economic situation of Telangana

ఆ తర్వాత తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్

బడ్జెట్‍‌లో తెలంగాణకు అన్యాయం జరగలేదు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉందని, ఆ తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు.

Advertisements
  విభజన నాటికి తెలంగాణ మిగులు

బడ్జెట్‌లో బీహార్‌తో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారనడం సరికాదని ఆమె అన్నారు. తెలంగాణకు కూడా నిధులు ఇచ్చామని తెలిపారు. తెలంగాణకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇచ్చామని ఆమె వెల్లడించారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సరైన ప్రాధాన్యత దక్కిందని ఆమె అన్నారు.

సమ్మక్క సారక్క, రామగుండం ప్లాంట్, పసుపు బోర్డు తెలంగాణకు ప్రాధాన్యతాంశాలని ఆమె పేర్కొన్నారు. పసుపు బోర్డును ఇచ్చింది ప్రధాని మోడీయే అని ఆమె అన్నారు. దివంగత ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్ నుండి పోటీ చేసి గెలిచారని, కానీ అక్కడ రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేసింది ప్రధాని నరేంద్రమోడీ అని నిర్మలా సీతారామన్ అన్నారు.

అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం లోక్ సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభను స్పీకర్ వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు. మరోవైపు కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మోజువాణి ఓటు ద్వారా బిల్లు తీర్మాణాన్ని ఆమోదించారు.

Related Posts
నందిగం సురేశ్ కు ఊరట
Nandigam Suresh surrendered in court

2020లో నమోదైన కేసులో కోర్టు బెయిల్ మంజూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సత్తెనపల్లి సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఆయనపై 2020లో Read more

ట్రంప్‌, జెలెన్‌స్కీ భేటీలో వాడీవేడి చర్చ
రష్యా విధ్వంసాన్ని ఒక్కసారి చూడండి.. ట్రంప్‌కు జెలెన్‌స్కీ విన్నపం

ఎలాంటి ఒప్పందం లేకుండానే వెళ్లిన జెలెన్‌స్కీ వాషింగ్ట‌న్ : అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ మ‌ధ్య.. వాషింగ్ట‌న్ డీసీలోని వైట్‌హౌజ్‌లో జ‌రిగిన భేటీ Read more

ప్రధాని మోదీ గయానా పార్లమెంట్‌లో ప్రసంగం…
modhi speech

భారత ప్రధాని నరేంద్ర మోదీ గయానా పార్లమెంట్‌లో ప్రసంగించిన సందర్భం దేశాల మధ్య ప్రతిష్టాత్మకమైన దౌత్య సంబంధాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి కావడమే కాక, అతని Read more

Gurugram: ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై లైంగికదాడి
Gurugram: ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై లైంగికదాడి

గురుగ్రామ్‌లోని ప్రముఖ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళపై, అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న టెక్నీషియన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏప్రిల్ 6న జరిగితే, బాధితురాలు Read more

Advertisements
×