కేరళలో 19 ఏళ్ల క్రితం జరిగిన రాజకీయ హత్యకేసులో 9 మంది RSS సభ్యులకు తలస్సేరి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ కేసు 2005 అక్టోబర్ 3న జరిగిన ఘటనకు సంబంధించినది. కన్నాపురం చుండాకు చెందిన 25 ఏళ్ల CPM సభ్యుడు రిజిత్ శంకరన్ పై RSS కార్యకర్తలు ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. రాజకీయ వర్గపోరుల కారణంగా జరిగిన ఈ దాడిలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగించారు. దీర్ఘకాలం న్యాయ ప్రక్రియ తర్వాత ఈ కేసులోని 9 మందిని నిందితులుగా నిర్ధారించింది.
జనవరి 4న తలస్సేరి కోర్టు ఈ కేసులో నిందితులను దోషులుగా ప్రకటించింది. అనంతరం శిక్ష ఖరారు కోసం తదుపరి విచారణ జరిగింది. కోర్టు న్యాయవాది వాదనలను పరిశీలించి, నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పును ప్రకటించింది. నిందితులపై హత్య, హత్యాయత్నం, అక్రమ ఆయుధాల ఉపయోగం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. న్యాయవ్యవస్థ తన పని చేసింది, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇది ఒక ఉపాధ్యాయం కావాలని బాధిత కుటుంబం పేర్కొంది.