హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి (Nilofar Hospital) ఇప్పుడు ఒక వినూత్న దశలోకి అడుగుపెట్టింది.ఇకపై రక్త పరీక్ష కోసం సూదితో పొడవాల్సిన అవసరం లేదు. కేవలం ముఖాన్ని స్కాన్ చేయడమే చాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.దేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే తొలిసారి ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఫోటో ప్లెథిస్మోగ్రఫీ (Photo plethysmography ) (PPG) ఆధారిత ఈ పరికరాన్ని ‘క్విక్ వైటల్స్’ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఇది అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా తీసుకురాబడ్డది.ఈ పీపీజీ పరికరం వినియోగం చాలా ఈజీగా ఉంటుంది. ఎల్ఈడీ ట్రైపోడ్కి అమర్చిన పరికరాన్ని మొబైల్తో కనెక్ట్ చేస్తారు.ఆ తర్వాత రోగి కేవలం 30 సెకన్లు స్క్రీన్ వైపు చూస్తే చాలు.అంతే! ఒక్క నిమిషంలోనే ఆరోగ్య పరిస్థితులన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.బీపీ, ఆక్సిజన్ స్థాయి, హార్ట్ బీట్, శ్వాసనిరీతి వంటి ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకోవచ్చు.(Niloufer Hospital)

ఇలా తక్కువ సమయంలో ఎన్నో అంశాలపై స్పష్టమైన సమాచారం అందుతుంది.ఈ పరికరం ముఖ్యంగా చిన్నారులకు వరం లాంటిది.సాధారణంగా పిల్లలకు రక్త పరీక్షంటే భయం ఉండేది. కానీ ఈ టెక్నాలజీతో వారిని కాస్తో కూస్తో చెబుతూ పరీక్షలు చేయవచ్చు.సులభంగా, నొప్పిలేకుండా, వేగంగా జరిగే పరీక్షలు వారికి భయాన్ని తగ్గిస్తాయి.నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, మొదటి దశలో వెయ్యిమంది పిల్లలపై ఈ పరికరం ప్రయోగిస్తామని చెప్పారు. వారి ఆరోగ్య రిపోర్టులను సవివరంగా విశ్లేషించి, తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.ఈ ప్రయోగం విజయవంతమైతే, రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ సాంకేతికత అందుబాటులోకి రానుంది. పిల్లల ఆరోగ్య పరిశీలనను సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నం సాగుతుంది.సాధారణంగా రక్త పరీక్షలకు ఎక్కువ సమయం పడుతుంది. ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ఈ టెక్నాలజీ ఆ సమస్యకు సమాధానం అవుతుంది.ముఖం స్కాన్ చేయడం వల్ల ఖర్చు తక్కువ, ఫలితాలు వేగంగా వస్తాయి. ఇది ప్రభుత్వ వైద్య రంగానికి పెద్ద అడుగు అనే చెప్పాలి.
Read Also : Bhuma Akhila Priya : ఆర్మీకి 5 నెలల జీతం విరాళంగా ప్రకటించిన టీడీపీ ప్రకటించిన భూమా అఖిలప్రియ