News Telugu: Karur Tragedy: కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలతో విజయ్ భేటీ

Read Time:  1 min
Karur Tragedy
Karur Tragedy
FONT SIZE
GET APP

Karur Tragedy: కరూర్‌ ర్యాలీ విషాదం తర్వాత బాధిత కుటుంబాలతో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ సమావేశమయ్యారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ సమావేశం జరిగింది. విజయ్‌ (vijay) ముందుగా వీడియో కాల్‌ ద్వారా బాధిత కుటుంబాలతో మాట్లాడి, త్వరలో ప్రత్యక్షంగా కలుస్తానని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానం ప్రకారం సోమవారం ఆయా కుటుంబ సభ్యులను ప్రత్యేక బస్సుల ద్వారా కరూర్‌ నుంచి చెన్నైకి రప్పించారు. టీవీకే తరఫున రిసార్ట్‌లో 50 గదులు బుక్‌ చేయబడ్డాయి. ఈ సందర్భంగా విజయ్‌ బాధితులతో కాసేపు మాట్లాడి వారి మనోభావాలను విన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే టీవీకే తరఫున రూ. 20 లక్షల పరిహారం అందజేశారు. గత సెప్టెంబర్‌ 27న కరూర్‌లో విజయ్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఆ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విజయ్‌, ఆ తర్వాత పరిస్థితిని దగ్గరగా గమనించారు.

Read also: Delhi Crime: కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసిన ప్రేమోన్మాది

Karur Tragedy

Karur Tragedy: కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలతో విజయ్ భేటీ

అయితే, చెన్నైలో (chennai) నే భేటీ ఏర్పాటు చేయడంపై కొంతమంది బాధిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. “మా ప్రాంతానికి వచ్చి స్వయంగా పరామర్శిస్తే బాగుండేది” అని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు, పార్టీ వర్గాలు మాత్రం భద్రతా కారణాల వల్లే చెన్నైలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాయి.

కరూర్‌ ర్యాలీ ఘటనలో ఏమి జరిగింది?
సెప్టెంబర్ 27న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు.

విజయ్ బాధిత కుటుంబాలను ఎప్పుడు కలిశారు?
విజయ్ సోమవారం చెన్నై సమీపంలోని మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో బాధిత కుటుంబాలను కలిశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.