हिन्दी | Epaper

AP: జగన్ అంటేనే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ :మంత్రి కొల్లు రవీంద్ర

Rajitha
AP: జగన్ అంటేనే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ :మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ : జగన్ అంటేనే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేసారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. దోచుకోవటం, దౌర్జన్యాలు చేయడం ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయడమే అతని విధానమన్నారు. తన విలాసవంతమైన నివాసం కోసం రిషికొండలో రూ.400 కోట్ల ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారన్నారు. రుషికొండ భవనానికి, యోగాకి లింకు పెడుతున్నాడు అంటే ఇలాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు. యోగా అనేది మన సనాతనమైన ఆస్తి అని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2014 నుంచి ప్రతి సంవత్సరం దేశంలో ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తున్నారని అన్నారు.

Read also: Women as Sarpanchs: భార్యలకు పదవులు, భర్తలకు అధికారాలు!

jagan is a failed politician

jagan is a failed politician

వైజాగ్లో నిర్వహించిన యోగా డే ఖర్చు రూ.18 కోట్లు అని.. దానిని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. యోగా వల్ల ప్రజల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఏపీ ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తే, అవగాహన లేని జగన్ దానిని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదన్నారు. అతనికి ప్రజలే తగిన తీర్పునిచ్చారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ మరలా రివైజ్ చేస్తున్నామన్నారు. లాభాలలో నడుస్తోందని అన్నారు. అభివృద్ధి చేస్తున్నా ప్రజలను తప్పుదోవ పట్టించే దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా జగన్ ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రం అభివృద్ధి చెందటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదన్నారు. జగన్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ సమాధిగా మారి పోతుందంటూ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

📢 For Advertisement Booking: 98481 12870