న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ తన అధికారిక భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని బాప్స్ స్వామినారాయణ అక్షరధామ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ విశిష్టత, ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి గురించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని లక్సన్ వెంట న్యూజిలాండ్ ప్రభుత్వ అధికారులు, మంత్రులు, వ్యాపారవేత్తలు, కమ్యూనిటీ ప్రతినిధులు సహా 110 మంది సభ్యుల ప్రతినిధి బృందం కూడా ఉన్నారు.
ఆధ్యాత్మిక వైభవానికి ముగ్ధులైన లక్సన్
బాప్స్ స్వామినారాయణ అక్షరధామ్ ఆలయానికి చేరుకున్న న్యూజిలాండ్ ప్రధాన మంత్రినకి ఆలయ పండితులు, నిర్వాహకులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిబింబంగా నిలిచే అక్షరధామ్ ఆలయ వైభవం, దాని నిర్మాణ కౌశలం గురించి లక్సన్ ఆసక్తిగా ప్రశ్నించారు. ఈ ఆలయం భారతదేశపు గొప్ప భక్తి సంప్రదాయాలను, సంస్కృతిని, విలువలను చాటిచెప్పే విధంగా నిర్మించబడింది. ఇది ఐక్యత – ఆధ్యాత్మికత సార్వత్రిక సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. అందరికీ శాంతి, సామరస్యం – శ్రేయస్సు కోరుతూ పురాతన హిందూ జల నైవేద్య ఆచారం అయిన అభిషేక్ వేడుకలో న్యూజిలాండ్ ప్రధాని పాల్గొన్నారు. ఈ పర్యటన సాంస్కృతిక జ్ఞాపికల మార్పిడి – రెండు (న్యూజిలాండ్ – భారతదేశం) సంస్కృతుల మధ్య లోతైన సహకారాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని లక్సన్ పేర్కొన్నారు.
మావోరీ భాషలో సత్సంగ్ దీక్ష
ప్రధానమంత్రికి మహాంత్ స్వామి మహారాజ్ రాసిన పవిత్ర హిందూ గ్రంథాన్ని అందజేశారు.. మావోరీ భాషలో సత్సంగ్ దీక్ష ప్రారంభ ముద్రణను అందజేశారు. ఈ అర్థవంతమైన బహుమతి భారతదేశం – న్యూజిలాండ్ మధ్య విశ్వాసం, సంస్కృతి, భక్తి ఉమ్మడి విలువలను హైలైట్ చేస్తుంది. సంస్కృతంలో రచించబడిన సత్సంగ్ దీక్ష స్వామినారాయణ సంప్రదాయంలో ఒక ప్రాథమిక గ్రంథంగా పనిచేస్తుంది,వ్యక్తులను అంతర్గత శాంతి, నిస్వార్థ సేవ – ఆధ్యాత్మిక క్రమశిక్షణ వైపు నడిపిస్తుంది. దీని అనువాదం రెండు దేశాల మధ్య లోతైన సాంస్కృతిక – ఆధ్యాత్మిక సంబంధాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది.

సమాజానికి సేవకు చిహ్నం
సందర్శన ముగింపులో ప్రధానమంత్రి లక్సన్కు హృదయపూర్వక సందేశాన్ని అందించారు.. “అక్షరధామ్లో మీ ఉనికి – మీరు ఈ సందర్శనకు కేటాయించిన సమయం సాంస్కృతిక – ఆధ్యాత్మిక విలువల పట్ల మీ గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. అక్షరధామ్ విశ్వాసం, ఐక్యత – సమాజానికి సేవకు చిహ్నంగా నిలుస్తుంది.. మీ సందర్శన సామరస్యం సద్భావన సందేశాన్ని మరింత బలోపేతం చేసింది.” అంటూ పేర్కొన్నారు. న్యూజిలాండ్ – భారతదేశం మధ్య స్నేహ బంధాలను బలోపేతం చేస్తూ సమగ్రమైన, శాంతియుత సమాజాన్ని పెంపొందించడానికి ప్రధానమంత్రి చేసిన ప్రయత్నాలను కూడా ఆయన చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు.
అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన అనుభవం
అక్షర్ధధామ్లో ఇక్కడ ఉండటం చాలా ప్రత్యేకమైనది. ఈ అద్భుతమైన ఆలయాన్న, జరిగిన అద్భుతమైన పనిని చూడటం నిజంగా స్ఫూర్తిదాయకం. ఇక్కడ సాధించిన వాటిని చూడటానికి న్యూజిలాండ్ నుండి మా వ్యాపార – సమాజ ప్రతినిధి బృందాన్ని తీసుకురావడం గొప్ప గౌరవంగా ఉంది. న్యూజిలాండ్లోని అన్ని బాప్స్ సమాజానికి నేను శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. 2023లో ఆక్లాండ్ను సందర్శించినట్లు నాకు గుర్తుంది, న్యూజిలాండ్లో విశ్వాసం, నిరంతర వృద్ధిని చూడటం, వెల్లింగ్టన్లో కొత్త ఆలయం ప్రారంభించడాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉంది. ఇది నిజంగా, నిజంగా ప్రత్యేకమైనది.” అంటూ పేర్కొన్నారు.