हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

నేటి నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు

Sudheer
నేటి నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా భూక్రయ విక్రయాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు మరియు ఇతర లావాదేవీలు పెరిగాయి. చార్జీల పెంపు కారణంగా గత కొంతకాలంగా ప్రజలు తమ రిజిస్ట్రేషన్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు నిన్న ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చారు. సాధారణంగా రోజుకు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగే కార్యాలయాల్లో నిన్న 170కి పైగా లావాదేవీలు నమోదయ్యాయి. ప్రభుత్వం కొత్త రేట్లు అమలు చేయబోతున్నట్లు ముందుగా ప్రకటించడంతో ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఉత్సాహం చూపించారు.

New registration charges in

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 1,184 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ప్రజలు అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించడంతో అక్కడ భారీ రద్దీ కనిపించింది. అధికారులు ముందస్తు జాగ్రత్తగా.. సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడ్డారు.

ఒక్క నిన్నటి రోజులోనే రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణ రోజుల్లో రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయంతో పోల్చితే ఇది భారీ పెరుగుదల. కొత్త ఛార్జీల వల్ల భవిష్యత్తులో మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కొత్త రిజిస్ట్రేషన్ ధరల వల్ల భూ విక్రయదారులు, కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త వ్యూహాలను రచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా కొంతకాలం మార్కెట్‌పై ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, దీర్ఘకాలికంగా చూస్తే, రెవిన్యూలో వృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం నమ్ముతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870