ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇక నుంచి వందేమాతరం గేయాలాపనను తప్పనిసరి చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలో వందేమాతరం పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోరఖ్పూర్లో ‘ఏక్తా యాత్ర’ పేరుతో నిర్వహించిన సామూహిక వందేమాతరం గేయాలాపన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. విద్యాసంస్థల్లో జాతీయ గీతాలాపన చేయడంవల్ల విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దానిపై గౌరవం, దేశభక్తి ఏర్పడుతాయని ప్రకటనలో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’ గేయానికి నవంబర్ 7తో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వ హించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. కాగా ఈ గేయాన్ని 1875 నవంబర్ 7న కించంద్ర ఛటర్జి రాశారు.
Read Also : medicine: ఒరిజినల్ మెడిసిన్ న్నే కొంటున్నారా? ఇలా తెలుసుకోండి

ఈ గేయం తొలిసారి ఛటర్జి రాసిన ‘ఆనంద్ మఠ్’ నవలలో ప్రచురితమైంది. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వందేమాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమని అన్నారు. ఈ శబ్దం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థుల్లో జాతిభక్తి, రాష్ట్రభక్తి, సామూహిక ఐక్యతని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.
యోగి ఆదిత్యనాథ్ తోబుట్టువుల సంఖ్య?
ఆయన కుటుంబంలో నలుగురు సోదరులు మరియు ముగ్గురు సోదరీమణులలో రెండవ వ్యక్తిగా జన్మించారు. ఆయన ఉత్తరాఖండ్లోని హేమవతి నందన్ బహుగుణ గర్హ్వాల్ విశ్వవిద్యాలయం నుండి గణితంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 1990ల ప్రాంతంలో అయోధ్య రామాలయ ఉద్యమంలో మరియు బాబ్రీ మసీదు కూల్చివేతలో చేరడానికి ఆయన తన ఇంటిని విడిచిపెట్టారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :