Telugu News:Vishal Singhal: కోట్ల ఇన్సూరెన్స్ కోసం..తల్లిదండ్రులు, భార్యను హత్య చేసిన కుమారుడు

Read Time:  1 min
Vishal Singhal
Vishal Singhal
FONT SIZE
GET APP

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చలించిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం మనిషి ఎంతకైనా వెళ్తాడనే నానుడిని నిజం చేస్తూ, ఓ వ్యక్తి తన తల్లిదండ్రులు, భార్యను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేసిన ఘోర సంఘటన బయటపడింది. ఈ కేసు రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ ఫ్రాడ్(Insurance Fraud) దర్యాప్తులో భాగంగా బయటపడింది.

Read Also: బంగారం రేట్లు క్షీణించాయి ఇప్పుడు కొనాలా, ఆగాలా?

Vishal Singhal
Vishal Singhal: కోట్ల ఇన్సూరెన్స్ మోసం..తల్లిదండ్రులు, భార్యను హత్య చేసిన కుమారుడు

విశాల్ సింఘాల్ చేతిలో జరిగిన హత్యల పరంపర

మీరట్‌లోని గంగా నగర్ ప్రాంతానికి చెందిన ముకేశ్ సింఘాల్ కుటుంబం ప్రశాంత జీవితం గడిపేది. ఆయన భార్య ప్రభాదేవి, కుమారుడు విశాల్,(Vishal Singhal) కోడలు ఏక్తాతో కలిసి ఉండేవారు. 2017లో రోడ్డు ప్రమాదంలో ప్రభాదేవి మరణించారు. ఐదేళ్ల తర్వాత 2022లో కోడలు ఏక్తా అనారోగ్యంతో మరణించిందని చెప్పబడింది. ఈ మరణాలు ప్రమాదాలు లేదా సహజ మరణాలుగా చూపించబడ్డాయి. 2024 మార్చిలో ముకేశ్ సింఘాల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మొదట చిన్న గాయాలతో బయటపడ్డ ఆయనను కుమారుడు విశాల్ ఆనంద్ ఆసుపత్రికి మార్చి, అక్కడ దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాడు.

ఇన్సూరెన్స్ మోసం దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన హత్యలు


సంభల్ ఏఎస్పీ అనుకృతి శర్మ నేతృత్వంలోని బృందం ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులను పరిశీలించగా, ముకేశ్ సింఘాల్ మరణం అనుమానాస్పదంగా తేలింది. ఆయన పేరిట రూ.50 కోట్ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయని గుర్తించారు. పోలీసుల ప్రకారం, విశాల్ గతంలో ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్‌గా పనిచేశాడు. తన పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ, కుటుంబ సభ్యుల పేర్లపై బీమా తీసి వారినే లక్ష్యంగా ఎంచుకున్నాడు.

ఆసుపత్రి సిబ్బంది సహకారంతో హత్య

విశాల్(Vishal Singhal) తన తండ్రిని చంపేందుకు ఆసుపత్రి డాక్టర్, మేనేజర్‌లకు రూ.1.5 లక్షల లంచం ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 1-2 రాత్రి మధ్య ముకేశ్ సింఘాల్‌ను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపారు. ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి తీసిన ఫోటోలో ముకేశ్ తలపై గాయం లేనప్పటికీ, పోస్ట్‌మార్టం రిపోర్టులో తలపై 8 సెం.మీ గాయం, ఛాతీ ఎముకలు విరిగినట్లు పేర్కొనడం అనుమానాలకు తావిచ్చింది. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు హత్య సత్యాన్ని వెలికితీశారు.

హత్య, మోసం కేసుల్లో అరెస్టులు

పోలీసులు పాత ఎఫ్‌ఐఆర్‌కు హత్య సెక్షన్లు జోడించి కేసును తిరిగి తెరిచారు. విశాల్ సింఘాల్, అతని స్నేహితుడు సతీశ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.

ఈ కేసు ఎక్కడ జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రధాన నిందితుడు ఎవరు?
ముకేశ్ సింఘాల్ కుమారుడు విశాల్ సింఘాల్ ప్రధాన నిందితుడు.

అతడు ఎవరిని హత్య చేశాడు?
తన తల్లి, భార్య, తండ్రిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్య చేశాడు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.