పశ్చిమాసియా(West Asia)లో ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా గ్లోబల్ ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా ప్రవహించే క్రూడ్ ఆయిల్ సరఫరా తగ్గిన నేపథ్యంలో, గ్లోబల్ మార్కెట్పై ఒత్తిడి పెరిగింది. అయితే ఈ యుద్దం వేళ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్ కు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది అమెరికా. భారత శుధ్ది కర్మాగారాలకు తాత్కాలిక మినహాంపులు ఇస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. భారత్ లో ఉన్న కొంతమంది స్నేహితుల వల్లే ట్రంప్ ఈ అనుమతి ఇచ్చినట్లు వైట్ హౌస్ తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పిటిఐకి తెలిపినట్లు.. ఈ చమురు ఇప్పటికే సముద్రంలో ఉంది. అందువల్ల భారత్ దీన్ని స్వీకరించి తన శుద్ధి కర్మాగారాల్లోకి తీసుకురావడం ద్వారా గ్లోబల్ మార్కెట్లో ఇంధన సరఫరా అంతరాన్ని తగ్గించగలదు.ఈ స్వల్పకాలిక చర్య రష్యా ప్రభుత్వానికి గణనీయమైన ఆర్థిక లాభం కలిగించదని లీవిట్ తెలిపారు.
Read Also: Viveka Murder Case: సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

అంతరాయాలను తక్షణంగా తగ్గించి సజావుగా చమురు సరఫరా
ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వివరించినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రెజరీ కార్యదర్శి, జాతీయ భద్రతా బృందం.. భారతదేశంలోని మిత్రదేశాలు మంచి నటులుగా వ్యవహరించడం, గతంలో మంజూరు చేయబడిన రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేయడం వల్ల ఈ నిర్ణయానికి వచ్చారని తెలిపారు. ఈ నిర్ణయం అంతరాయాలను తక్షణంగా తగ్గించి, చమురు సరఫరాను సజావుగా నిర్వహించడానికి తీసుకున్న తాత్కాలిక చర్యగా అమెరికా చెబుతోంది. భారతదేశంలోని శుద్ధి కర్మాగారాలు ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యన్ చమురును స్వీకరించి, తక్షణం శుద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేయగలవు. ఇది చమురు ధరల పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుందని..ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ తెలిపారు. మార్కెట్లో ఒత్తిడిని తగ్గించడమేకాకుండా ఇతర శుద్ధి కర్మాగారాలపై భారతీయులు పోటీ పడకుండానే సరఫరా ప్రవహింపును సులభతరం చేస్తుందని తెలిపారు.
భారతదేశం రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి స్వీకరించిన 30 రోజుల మినహాయింపు.. రష్యా ప్రభుత్వానికి తాత్కాలికంగా ఏ పెద్ద ఆర్థిక లాభం ఇవ్వదు. దీన్ని కేవలం స్వల్పకాలిక, ఆచరణాత్మక చర్యగా మాత్రమే భావించవచ్చు. అమెరికా పాలసీలో ఎటువంటి మార్పు జరగలేదు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :