ఏదైనా కేసులో ఇరుక్కున్నామంటే.. ఇక జీవితాంతం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగాల్సి ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. అలాగే సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. కానీ నిజజీవితంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఉత్తరప్రదేశ్ (UP) లో, 40 ఏళ్ల క్రితం నాటి ఓ హత్య కేసులో నిందితుడిగా చేర్చిన 100 ఏళ్ల వృద్ధుడికి ఇప్పటికి మోక్షం లభించింది. అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) దాదాపు 100 ఏళ్ల ధామి రామ్ను హత్య కేసులో నిర్దోషిగా ప్రకటించింది.
Read Also: IRCTC: తత్కాల్ బుకింగ్లో విప్లవాత్మక మార్పులు!
కుటుంబ సభ్యులు సంతోషం
1982 నాటి భూ వివాద హత్య కేసులో 1984లో ధనీరామ్, సత్తిదిన్కు జీవిత ఖైదు శిక్ష విధించింది. సెషన్స్ కోర్టు తీర్పుపై 40 ఏళ్ల క్రితం వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది. పిటిషన్ విచారణ దశలో ఉండగా, వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో మంజూరైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మైకు అరెస్టు కాలేదు. ఈ కేసును హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ప్రధాన నిందితుడు మైకును అరెస్టు చేయకపోవడాన్ని ప్రశ్నించింది.

అనంతరం ధనీరామ్ అప్పీలుపై నిర్ణయంలో జాప్యం, ప్రాసిక్యూషన్లో లోపాలను ఎత్తి చూపిన న్యాయస్థానం, అతడి వయస్సును కూడా పరిగణనలోకి తీసుకుని నిర్దోషిగా తేల్చింది. ఇలా 100 ఏళ్ల వయసులో భగవాన్ సింగ్ విడుదల కాగా.. ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ న్యాయం ఇంత ఆలస్యం అవడం బాధ కలిగిస్తోందని.. చేయని తప్పుకు దాదాపు 40 ఏళ్లుగా ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: