ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (uttar pradesh) ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో చదువు నాణ్యతను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సర్కారు బడుల్లో చదివే పిల్లలు సిలబస్ పుస్తకాలతో పాటు రోజూ వార్తాపత్రికలు కూడా చదవాల్సిందేనని ఆదేశించింది. పాఠ్యాంశాల విజ్ఞానంతో పాటు లోకజ్ఞానం కలగాలన్నదే ఈ విధానం ప్రధాన ఉద్దేశ్యం. దేశం, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపై చిన్న వయసులోనే అవగాహన పెరగాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read also: Bengal Hotels: బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

UP Government Schools
అసెంబ్లీలో రోజూ 10 నిమిషాల న్యూస్ పఠనం
విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతిరోజూ ఉదయం పాఠశాల అసెంబ్లీలో 10 నిమిషాల సమయాన్ని ప్రత్యేకంగా వార్తాపత్రిక పఠనానికి కేటాయించాలి. విద్యార్థులు రొటేషన్ పద్ధతిలో జాతీయ, అంతర్జాతీయ, క్రీడలు, ఆర్థికం, సంపాదకీయ విభాగాల నుంచి ముఖ్యమైన వార్తలను చదివి వినిపించాలి. హిందీతో పాటు ఇంగ్లీష్ దినపత్రికలను కూడా పాఠశాలల దినచర్యలో భాగం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విద్యార్థుల ఆలోచనా శక్తికి బలం
నిత్యం వార్తాపత్రికలు చదవడం వల్ల విద్యార్థుల్లో జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. వర్తమాన అంశాలపై పట్టు రావడం ద్వారా భవిష్యత్తులో పోటీ పరీక్షలకు ఇది ఉపయోగపడుతుంది. సంపాదకీయాల పఠనం వల్ల పదజాలం మెరుగుపడటమే కాకుండా స్వయంగా రాయగల నైపుణ్యం పెరుగుతుంది. అలాగే మొబైల్ ఫోన్లు, ట్యాబ్లకు అతుక్కుపోయే అలవాటు తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: