Ahmedabad Plane Crash : ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Read Time:  1 min
Ahmedabad Plane Crash : ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
FONT SIZE
GET APP

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాద (Ahmedabad Plane Crash) ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) విజయవాడ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడికి చేరిన వెంటనే ఆయన ప్రత్యక్షంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థితిగతులపై అధికారుల నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని భరోసా

ప్రమాద స్థలానికి వెళ్లిన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఈ దుర్ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా మద్దతుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వెంటనే సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక దళం రంగంలోకి దిగడం వల్ల మరిన్ని ప్రాణనష్టాలు తలెత్తకుండా నివారించగలిగామని పేర్కొన్నారు.

అమిత్ షా పరిశీలన, కేంద్ర స్థాయి సమీక్ష

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఆయన కూడా అహ్మదాబాద్‌ చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి ఘటనకు గల కారణాలను త్వరితగతిన వెలుగులోకి తేయాలని సూచించారు.

Read Also : Boeing Shares Crash : ఫ్లైట్ ప్రమాదం.. అమెరికాలో బోయింగ్ షేర్లు భారీగా పతనం

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.