Telugu News: Uganda: డిఎన్ ఏ పరీక్షలో షాక్.. 98శాతం పిల్లలకు వారు తండ్రులు కారు.

Read Time:  1 min
Uganda
Uganda
FONT SIZE
GET APP

తమ భార్యలు గర్భం దాల్చారని వార్త తెలిస్తే చాలు భర్తలు హ్యాపీ ఫీలవుతారు. త్వరలో తాము తండ్రి కాబోతున్నందుకు వారి ఆనందానికి అవధులు ఉండవు. పుట్టబోయే బిడ్డకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ బిడ్డలు పుట్టాకు వారికి తాము తండ్రులు కామనే సత్యం తెలిసినప్పుడు వారి గుండెవేదన ఎంతగా ఉంటుంది?

Read Also: Pakistan: పెషావర్‌లో వరుస పేలుళ్లు– కాల్పులతో ఉద్రిక్తత

షాక్ లో ఉన్న తండ్రులు

ఆఫ్రికా దేశం ఉగాండా (Uganda) ప్రస్తుతం ప్రస్తుతం తీవ్రమైన సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా తమ పిల్లలకు తమ పోలికలు కాకుండా వేరే వాళ్లని రావడంతో అనేకమంది పురుషులు తమ పోలికలు కాకుండా వేరే వాళ్లని రావడంతో అనేకమంది పురుషులు తమ పిల్లలకు డీఎన్ ఏ పరీక్షలు చేయిస్తున్నారు. ఇలా చేయించుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండగా అందులో 98శాతం మందికి, ఆ పిల్లలకు తాము తండ్రులం కాదని తెలిసి షాక్ కు గురవుతున్నారు.

Uganda
Uganda Shocking DNA test.. 98 percent of children are not fathers.

గుండె పదిలంగా ఉంటేనే పరీక్ష చేయించుకోండి

ఈ సమస్య గురించి తెలుసుకున్న ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి షాకింగ్ కామెంట్లు చేశారు. ‘మీ గుండె దృఢంగా ఉంటే తప్ప, ఈ పరీక్షలు చేయించుకునేందుకు ముందకు రాకండి’ అంటూ ఆయన బహిరంగంగా హెచ్చరించారు. ఇటీవలే అక్కడి కోర్టులో విచారించిన ఓ కేసు ఈ తీవ్ర సంక్షోభానికి కారణంగా తెలుస్తోంది. కంపాలాలోని ఓ సంపన్న విద్యావేత్త తన ముగ్గురు సంతానంలో ఒకరికి తండ్రి కాదని డీఎన్ఏ (DNA) పరీక్షలో తేలింది. స్థానిక మీడియా ఈ కేసును వవిస్తృతంగా ప్రచురించడంతో ఇది దేశవ్యాప్తంగా పురుషుల్లో త సంతానంపై అనుమానాలను రేకెత్తించింది. దీంతో అనేక మందికి, ముఖ్యంగా తమ పోలీకలతో లేని పిల్లలపై అనుమానం పెరిగింది. దీంతో డీఎన్ ఏ పరీక్షల కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.

దేశమంతటా పెరిగిన డిఎన్ ఏ పరీక్ష కేంద్రాలు

డిఎన్ ఏ పరీక్షా కేంద్రాలకు డిమాండ్ పెరగడంతో దేశమంతటా ఈ కేంద్రాలు విస్తృతంగా వ్యాప్తిస్తున్నాయి. తమ పిల్లలు తమకు పుట్టినవారు కాదని తెలుసుకుని కుంగిపోతున్నారు. అసలు తమ భార్యలు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక నరకం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ సంప్రదాయాల ప్రకారం ఒక మహిళ తన భర్తకు సంతానం ఇవ్వడంలో విఫలమైతే, ఆమె విడాకులు ఇవ్వాలి. లేదా ఇంటి నుంచి బహిష్కరణ వంటి శిక్షను ఎదుర్కొవలసి వస్తుంది. చాలా సందర్భాల్లో పురుషుల్లోనే సంతాన సమస్యలు ఉన్నప్పటికీ శిక్ష మాత్రం మహిళలకు పడుతుండడంతో కొందరు మహిళలు తమ వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికి ఇతరుల ద్వారా పిల్లలకు కనడానికి మొగ్గు చూపుతున్నారని ఒక అధికారి తెలిపారు.

రంగంలోకి దిగిన మత పెద్దలు విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను కాపాడేందుకు మతపెద్దలు, తెగ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా డీఎన్ ఏ పరీక్షలు చేయించుకోలేని, ఎక్కువగా డబ్బు లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు “పిల్లలు ఎలా పుట్టినా, వారు ఈ ఇంటివారే. వారిని తిరస్కరించడం పాపం’ అని నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ విలువలను కాపాడటానికి చర్చిలు కూడా డీఎన్ ఏ పరీక్షలపై దృష్టి పెట్టవద్దని సూచిస్తున్నాయి. అయినప్పటికీ అనేకమంది పరీక్షలు చేయించుకుంటూ.. చేదు ఫలితాతో జీవితాన్ని నాశనం చేసుకోవడం విచారకరం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.