हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Vijay: తొక్కిసలాటపై స్పందించిన టీవీకే అధినేత విజయ్

Anusha
Latest News: Vijay: తొక్కిసలాటపై స్పందించిన టీవీకే అధినేత విజయ్

కరూర్ జిల్లా (Karur District) లో శనివారం సాయంత్రం జరిగిన ఘోరమైన తొక్కిసలాట ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 39 మంది ప్రాణాలను కోల్పోయారు, వీరిలో 10 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఉన్నారు. ఈ విషాదం రాజకీయ, సామాజిక, మానవతా పరంగా భారీ ఆందోళనలను సృష్టించింది. అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు,మీడియా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.

 Sanjana: డ్రగ్స్ ఆరోపణలు – సంజనా గల్రానీపై సుప్రీంకోర్టు కొత్త చర్య

తొక్కిసలాటపై స్పందించిన టీవీకే అధినేత విజయ్ (Vijay), తొక్కిసలాట వార్తలు వెలువడిన కొన్ని గంటల తర్వాత ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అందులోనే “నా గుండె ముక్కలైంది. మాటల్లో చెప్పలేని, భరించలేని దుఃఖం, బాధతో కుమిలిపోతున్నాను” అని ఆయన రాసుకొచ్చారు. “కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరసోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ఆయన అందులో పేర్కొన్నారు.

వాస్తవానికి టీవీకే అధినేత (Head of TVK) మధ్యాహ్నం 12 గంటలకే కరూర్ చేరుకోవాల్సి ఉంది. కానీ ఆయన దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే ఆయన్ను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రచార బస్సు కూడా రోడ్డుపై వెళ్లడానికి స్థలం లేనంతగా జనసమూహం పెరిగిపోయింది.

(DMK) ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఇది నిర్వాహకుల ఉద్దేశపూర్వక కుట్ర అని ఆరోపించారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన డీఎంకే (DMK) ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఇది నిర్వాహకుల ఉద్దేశపూర్వక కుట్ర అని ఆరోపించారు. “ఈ కార్యక్రమం ఒక నిర్దిష్ట సమయంలో ప్రారంభం కావాలని విజయ్ స్పష్టంగా చెప్పినప్పటికీ.. అది జరగలేదు.

ప్రజలు దాదాపు ఆరు గంటలు వేచి ఉన్నారు. నిర్వాహకులు ఎందుకు ఇలా చేశారు? జనసమూహాన్ని మరింత ఎక్కువగా సమీకరించడానికి వారు ఈ చవకబారు వ్యూహాన్ని ఉపయోగించారు. ఇది నిర్వాహకుల నేరపూరిత నిర్లక్ష్యం” అని ఆయన మీడియాకు తెలిపారు.

విజయ్ కూడా దీనికి బాధ్యుడు

అంతేకాకుండా “ఈ దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో.. వారిని అరెస్టు చేయాలి. విజయ్ కూడా దీనికి బాధ్యుడు. ఆయన బాధ్యత నుంచి తప్పించుకోలేరు” అని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు.ఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (M.K.Stalin) కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

ఈ ఘటనపై విచారణ జరపడానికి.. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఒక ఏకసభ్య విచారణ కమిషన్‌ (Commission of Inquiry) ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. “ఈ అమూల్యమైన ప్రాణాల నష్టం మనందరి హృదయాలను కలచివేసింది. ఈ తీరని నష్టాన్ని అనుభవించిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

ఆసుపత్రుల్లో చేరిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని నేను ఆదేశించాను. ఈ రాత్రి నేను కరూర్‌కు వెళ్లి మృతుల కుటుంబాలను కలుసుకుని, వారికి సానుభూతి తెలియజేస్తాను. అలాగే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని కూడా సందర్శిస్తాను” అని ముఖ్యమంత్రి తన ప్రకటనలో తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. రాహుల్‌

ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. రాహుల్‌

20 ఏళ్లుగా చీకటి గదిలో బందీగా ఉన్న యువతికి విముక్తి

20 ఏళ్లుగా చీకటి గదిలో బందీగా ఉన్న యువతికి విముక్తి

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

వడ్డీ రేట్లు తగ్గాయి .. మరి EMI పరిస్థితి ఏంటి?

వడ్డీ రేట్లు తగ్గాయి .. మరి EMI పరిస్థితి ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870