స్త్రీకి స్త్రీయే శత్రువని ఈ ఉదంతం చదివితే నిజమేననిపిస్తుంది. ఓ మహిళగా తోటి మహిళల్ని గౌరవించాల్సింది పోయి, నీచమైన పనిద్వారా డబ్బును సంపాదించేందుకు దిగజారింది. ఆమె చేసిన పనిని తెలుసుకున్న పోలీసులే అవాక్కైపోయారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఉండి తమిళనాడు(Tamil Nadu) పరిధిలోకి వచ్చే డెంకణీకోట పట్టణ సమీపాన నాగమంగలంలో విస్తరించిన భారీ సెల్ ఫోన్ల తయారీ పరిశ్రమలో వేలాదిమంది మహిలలు పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో పనిచేసే వారికి ఒక హాస్టల్ సైతం ఉంది. అందులో(TN Crime) దాదాపు రెండువేలమంది ఉంటున్నారు. వారుండే హాస్టల్ బిల్డింగ్ లోని స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు అమర్చడం కలకలం రేపింది.
Read also: భక్తులకు గుడ్ న్యూస్.. 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!

ఆందోళనకు దిగిన మహిళలు
మహిళలు స్నానాలు చేసే గదుల్లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను విక్రయించి వ్యాపారం చేస్తున్నారనే సమూచారం రావడంతో వారంతా ఆందోళనకు దిగారు. విధులు ముగించుకుని వచ్చినవారందరికి ఈ విషయం తెలియడంతో ఆందోళనకు దిగారు. బాధ్యులెవరో తేలల్చాలంటూ అర్థరాత్రి వరకు ఆందోళన చేశారు. విషయం తెలిసి కృష్ణగిరి జిల్లా ఎస్పీ తంగదురై, డెంకణీకోట డీఎస్పీ ఆనందరాజ్, సీఐ శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని, మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసులు అధికారిక నిఘా కెమెరాల వీడియోలను పరిశీలించారు. అందులో కెమెరాలు అమర్చింది ఎవరో తెలిసి షాక్ అయ్యారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన నీలకుమారి అనే మహిళే స్నానాల గదటుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చినట్లు పోలీసులు నిర్ధారించారు. వీటిలో నిక్షిప్తమైన వీడియోలను బబెంగళూరులో సంతోష్ అనే వ్యక్తికి పంపించి, వాటి ద్వారా వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. పోలీసులు నీలకుమారిని అరెస్టు చేయడంతో మహిళా ఉద్యోగులు ఆందోళన విరమించారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మహిళలకు భద్రత అనేది కొరవడుతున్నది. ఇటీవల లేడీస్ వాష్ రూమ్లలో ఇలాంటి కెమెరాలను అమర్చడం ఎక్కువైపోతున్నది. స్త్రీ గౌరవాన్ని కీచకులు దిగజార్చే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: