हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bangalore Stampede : తొక్కిసలాటలో చనిపోయిన టెకీ కథ తెలిస్తే కన్నీరు పెట్టుకోవాల్సిందే

Sudheer
Bangalore Stampede : తొక్కిసలాటలో చనిపోయిన టెకీ కథ తెలిస్తే కన్నీరు పెట్టుకోవాల్సిందే

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన భీభత్స తొక్కిసలాట(Bangalore Stampede)లో ప్రాణాలు కోల్పోయిన వారిలో తమిళనాడుకు చెందిన ఐటీ ఉద్యోగి దేవి కథ మరింత విషాదంగా మారింది. బెంగళూరులో చదువుకొని అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజినీరు(Software Engineer Devi)గా పని చేస్తున్న దేవికి విరాట్ కోహ్లీపై అమితమైన అభిమానం ఉండేది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ టీమ్‌కు సన్మానం జరుగుతుందని తెలిసి, దేవి ఒక్క టికెట్ కోసం ఎంతో ఆశతో స్టేడియానికి వెళ్లింది. అయితే టికెట్లు దొరకకపోయినా, స్టేడియం బయట అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న దేవి, తన పైఅధికారులు సెలవు మంజూరు చేయకపోయినా వినకుండా వెళ్ళిపోయింది. అయితే ఆ రోజు తిరిగిరాకపోతుందని ఎవరూ ఊహించలేకపోయారు.

ఆమె నుండి వచ్చిన చివరి మెసేజ్

దేవి చివరిసారిగా మెట్రోలో వెళ్తున్నానని తన సహోద్యోగికి మెసేజ్ పెట్టింది. అది ఆమె నుంచి వచ్చిన చివరి సందేశం. స్టేడియం వద్ద కోహ్లీని చూడాలన్న కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించిన దేవి, తొక్కిసలాటలో నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా, అక్కడే లభించిన ఆఫీసు ఐడీ కార్డు ద్వారా ఆమెను గుర్తించారు. సమాచారం అందిన తర్వాత ఆమె ఆఫీసు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు. దేవి టేబుల్‌పైనే ల్యాప్‌టాప్, బ్యాగ్ అలాగే ఉండటంతో, ఆమె గడచిన క్షణాలను తలుచుకుంటూ సహోద్యోగులు కన్నీరు మున్నీరయ్యారు.

ఆమె కుటుంబంలో తీరని లోటు

దేవి ఆకస్మిక మరణం ఆమె కుటుంబానికి తీరని లోటు. కేవలం తన అభిమాన క్రికెటర్‌ను ఒకసారి ప్రత్యక్షంగా చూడాలన్న తాపత్రయమే ఆమెను జీవితాంతం విడిచిపెట్టేసింది. ఈ సంఘటన క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి నిర్వహణలో ఉండే లోపాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రజల భద్రత కంటే ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెద్దగా చూడడమే ఇలా అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటోంది. దేవి లాంటి వారి విషాదాంతాలు భవిష్యత్తులో మరొకరికి జరగకూడదంటే, ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read Also : Delhi court : సాకేత్‌ కోర్టులో ఖైదీ దారుణ హత్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870