हिन्दी | Epaper

Waqf Amendment Bill : వక్స్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం – కిషన్ రెడ్డి

Sudheer
Waqf Amendment Bill : వక్స్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం – కిషన్ రెడ్డి

వక్స్ (Waqf) సవరణ బిల్లు 2024 లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లుతో వక్స్ సంస్థలలో పరిపాలనా వ్యవస్థ మరింత బలపడుతుందని, అవినీతిని నిరోధించేందుకు ఇది సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో వక్స్ స్థలాల నిర్వహణ, ఆస్తుల భద్రత వంటి అంశాల్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, ఈ కొత్త చట్టంతో సమగ్ర విధానాన్ని అమలు చేసేందుకు మార్గం సిద్ధమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సవరణ బిల్లులో ముఖ్యంగా పారదర్శకతను పెంపొందించేందుకు ప్రత్యేక నిబంధనలు కలవని, తద్వారా వక్స్ సంస్థల నిర్వాహణ మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా, ముస్లిం మహిళలు, పస్మాందా సముదాయాలు, అఘాఖానీలు వంటి వర్గాలకు ఈ చట్టం ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. వక్స్ ఆస్తుల వివాదాలు, అక్రమ ఆక్రమణలను నివారించేందుకు బిల్లు గట్టి నియంత్రణలను అమలు చేస్తుందని కూడా తెలిపారు.

Kishan Reddy on a hasty visit to Delhi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజులకు కిషన్ రెడ్డి ఈ చట్టానికి మద్దతునిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ముస్లిం సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా అమలు చేయబడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో మతపరమైన, సామాజిక సమతుల్యతను పెంపొందించడంలో ఈ చట్టం కీలక భూమిక పోషించనుందని, వక్స్ ఆస్తుల పరిరక్షణతో పాటు, వాటిని సామాజిక సేవలో వినియోగించేందుకు కొత్త మార్గాలను అందించగలదని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870