Terrorist Attack ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు వేడెక్కాయి. ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం, ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF)’ అనే ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉండటమే ఉద్రిక్తతలకు కారణం. ఈ సంస్థ లష్కరే తాయిబా (LeT)కు అనుబంధంగా వ్యవహరిస్తుందని అధికారులు తెలిపారు.ఈ Terrorist Attack కి ప్రతిస్పందనగా, భారత ప్రభుత్వం పలు దిశల్లో చర్యలు ప్రారంభించింది. మొదటగా పాకిస్థాన్కు చెందిన ప్రముఖుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత ప్రభుత్వం నిలిపివేసింది.

ఈ జాబితాలో అలీ జాఫర్, సనం సయీద్, బిలాల్ అబ్బాస్, ఇక్రా అజీజ్, సజల్ అలీ, ఇమ్రాన్ అబ్బాస్ వంటి పేర్లు ఉన్నాయి.ఇన్స్టాగ్రామ్లో వీరి ఖాతాలను భారత్లో యాక్సెస్ చేయాలనుకుంటే, ఈ ఖాతా మీ ప్రాంతంలో అందుబాటులో లేదు, అన్న సందేశం కనిపిస్తోంది.వీటిని చట్టబద్ధ అభ్యర్థనలతో బేస్ చేసుకుని బ్లాక్ చేసినట్టు సమాచారం.ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాదు, పాకిస్థాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను కూడా భారత్ నిషేధించింది. ఈ ఛానళ్లు దేశ భద్రతపై తప్పుడు సమాచారం పంచుతున్నట్లు కేంద్రం తెలిపింది.
ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ నిర్వహించే ఛానల్ కూడా ఉంది. దీని సబ్స్క్రైబర్లు 3.5 మిలియన్లకు పైగా ఉన్నా, భారత్లో పూర్తిగా బ్లాక్ అయింది.భారత ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటున్నది. సింధు జలాల ఒప్పందం రద్దు చేయబడింది.ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. అలాగే, ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో పనిచేస్తున్న వారినీ భారత్ తగ్గించింది.
ఇది దౌత్య సంబంధాల్లో స్పష్టమైన మార్పుగా భావించాలి.పాకిస్థానీ పౌరులకు ఇచ్చిన వీసాలను కూడా భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల పర్యటనలు, వ్యాపార సంబంధాలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. పాక్ ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.ఇన్ని చర్యలతో పాటు, భారత్ సైనికంగా కూడా స్పందించవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాక్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఖచ్చితంగా గమనించిందని సమాచారం. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also : Pak : పాకిస్థాన్ కు బిగ్ షాక్