Telugu News: Arunachal Pradesh-అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు: రెండు వాహనాలు ధ్వంసం

Read Time:  1 min
Arunachal Pradesh-అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు: రెండు వాహనాలు ధ్వంసం
Arunachal Pradesh-అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు: రెండు వాహనాలు ధ్వంసం
FONT SIZE
GET APP

Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ దగ్గర కొండచరియలు విరిగిపడటంతో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ రాయి ఒకటి కొండ పైనుంచి దూకుతూ రావడం గమనించిన డ్రైవర్లు సమయానికి అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కొండచరియల కారణంగా దిరాంగ్–తవాంగ్(Dirang-Tawang) గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంటనే అధికారులు రంగంలోకి దిగి, రోడ్డుపై పేరుకున్న రాళ్లను తొలగించి వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.

ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాళ్లు పడుతుండటాన్ని గమనించిన వాహనదారులు వేగంగా వెనక్కి తిరిగి వెళ్ళడం, తోటి ప్రయాణికులను హెచ్చరించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది ప్రయాణికులు ప్రాణభయంతో వాహనాల నుంచి దిగి పరుగులు తీశారు. వాహనదారుల జాగ్రత్త వల్ల ప్రాణనష్టం(Loss of life) జరగలేదని అధికారులు తెలిపారు.

కొండచరియలు విరిగిపడటంతో ఏమి జరిగింది?
రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి, అయితే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రాణనష్టం జరగలేదు.

రాకపోకల పరిస్థితి ఎలా ఉంది?
కొండచరియల కారణంగా దిరాంగ్–తవాంగ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు రాళ్లను తొలగించి రహదారిని శుభ్రం చేయడానికి చర్యలు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/social-media-doom-scroller-job/business/536167/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.