తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (Express flight) IX-196 మరోసారి విమర్శలకు గురైంది. జూన్ 13న దుబాయ్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఈ విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. రాత్రి 7:25కి బయలుదేరాల్సిన ఈ విమానం చివరికి తెల్లవారుజామున 12:44కి మాత్రమే ప్రయాణం ప్రారంభించింది.దాదాపు 150 మందికి పైగా ప్రయాణికులు ఐదు గంటల పాటు విమానంలోనే కూర్చొని ఉండాల్సి వచ్చింది. ఏసీలు ఆపేయడం వల్ల ఉక్కపోతతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నీరు, ఆహారం (Water, food) ఏమీ ఇవ్వకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రయాణికులు తమ బాధను ఫొటోలు, వీడియోల రూపంలో పంచుకున్నారు. ఎయిర్లైన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబ్బంది నిర్లక్ష్యం పై ప్రయాణికుల ఆవేదన
సాంకేతిక లోపం వల్ల ఏసీ పనిచేయకపోయినా ఎవరూ స్పందించలేదని ప్రయాణికులు వాపోయారు. పదే పదే సహాయం కోరినా, సిబ్బంది నుంచి సరైన స్పందన రాలేదని ఆరోపించారు. కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం బాధాకరమని వారు చెప్పారు.ఇదే సమయంలో, మరో దారుణ ఘటన ఎయిర్ ఇండియాను చుట్టుముట్టింది. బోయింగ్ 787 విమానం లండన్కు బయలుదేరిన రెండు నిమిషాల్లోనే కూలిపోయింది. ఇది వైద్య కళాశాల హాస్టల్ భవనాన్ని ఢీకొనగా, దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విమానయాన భద్రతపై కొత్తగా ప్రశ్నలు రేపుతోంది.
ఎయిర్ ఇండియా పరిస్థితిపై ప్రయాణికుల్లో భయభ్రాంతులు
తరచూ ఎయిర్ ఇండియా విమానాల్లో ఇలాంటి సమస్యలు రావడంతో ప్రయాణికుల్లో భయం పెరిగింది. సాంకేతిక లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం, సరైన సమాచారం లేకపోవడం విమానయానంపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.
Read Also : Ahmedabad : ఒకే బాడీ బ్యాగ్ లో రెండు తలలు : డీఎన్ఏ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి…