తమిళనాడులోని(Tamilnadu) కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో మళ్లీ విషాదం చోటుచేసుకుంది. అయ్యర్పాడి తేయాకు తోటలో చిరుతపులి దాడికి గురైన ఐదేళ్ల సైఫుల్ అనే బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అస్సాంకు చెందిన వలస కార్మికుడి కుమారుడైన సైఫుల్ శనివారం ఇంటిముందు ఆడుకుంటుండగా, పొదల్లో దాగి ఉన్న చిరుత అతడిపై దాడి చేసి తోట లోపలికి లాగుకుంది. వెంటనే గాలింపు ప్రారంభించిన కార్మికులు, అటవీ సిబ్బంది కొద్దిసేపటి తర్వాత బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు.
Read Also: Goa: గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి
గత ఎనిమిది నెలల్లో ఇదే ప్రాంతంలో ఇలాంటి దాడుల్లో ఇది మూడో చిన్నారి మృతి కావడం భయం మరింత పెంచింది. ఆగస్టులో(Tamilnadu) నూర్జిల్ హక్ (8), జూన్లో రోషిణి (4) చిరుత దాడిలో మరణించిన ఘటనలు ఇంకా మిగిలే ఉన్నాయి. తేయాకు తోటల పక్కనే ఉన్న ఎస్టేట్ కాలనీలకు సరైన ఫెన్సింగ్, లైటింగ్ లేకపోవడం సమస్యను మరింత తీవ్రమం చేస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అదనపు కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పహారాను పెంచారు. సాయంత్రం తర్వాత పిల్లలను బయటకు అనుమతించవద్దని, ఎక్కడైనా చిరుత సంచారం కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. వన్యప్రాణి దాడులను అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: