हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Election Commission : బీఎల్ఓలపై బెదిరింపుల్ని కట్టడి చేయకపోతే ఈసీకి సుప్రీంకోర్టు హెచ్చరిక…

Sai Kiran
Election Commission : బీఎల్ఓలపై బెదిరింపుల్ని కట్టడి చేయకపోతే ఈసీకి సుప్రీంకోర్టు హెచ్చరిక…

Election Commission : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో పాల్గొంటున్న బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) సహా ఇతర అధికారులకు పశ్చిమ బెంగాల్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో బెదిరింపులు ఎదురవుతున్నాయన్న అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించకపోతే పరిపాలనా వ్యవస్థలో అనార్కీ నెలకొనే ప్రమాదం ఉందని మంగళవారం ఎన్నికల సంఘాన్ని (EC) హెచ్చరించింది.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం, ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కావాల్సిన సహకారం లభించట్లేదన్న ఆరోపణలపై కూడా స్పందించింది. “భూమిస్థాయిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా SIR ప్రక్రియ పూర్తి కావాలని మేము కోరుతున్నాం” అని కోర్టు స్పష్టం చేసింది.

ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోతే స్థానిక పోలీసులను డిప్యుటేషన్‌లో తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. అవసరమైతే కేంద్ర బలగాలను కూడా మోహరించాల్సి వస్తుందని అన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందు పోలీసులపై పూర్తి నియంత్రణ కల్పించడం కష్టమని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు.

Read Also: Read Also: Jasprit Bumrah: సౌతాఫ్రికాతో తొలి టీ20.. బూమ్రా సంచలన రికార్డు

“ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రపరిణామాలు తప్పవు. (Election Commission) ఇది చాలా గంభీరమైన అంశం,” అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు.

బీఎల్ఓలకు సరైన భద్రత కల్పించాలని కోరుతూ ‘సనాతన సంఘ్’ తరఫున వకీల్ వి. గిరి వాదనలు వినిపించారు. అయితే ఒకే ఒక సంఘటన ఆధారంగా ప్రత్యేక పరిస్థితి అని నిర్ణయించలేమని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది.

అదేవిధంగా బిఎల్ఓలపై పని భారం ఎక్కువగా ఉందన్న ఆరోపణలకూ కోర్టు స్పందించింది. ఓటర్ల సంఖ్యను ఒక్కో పోలింగ్ బూత్‌లో 1,500 నుంచి 1,200కు తగ్గించడం ద్వారా కొంత భారం తగ్గించామని ఎన్నికల సంఘం వివరించింది. అయితే ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయాల్సిన విధానం వల్ల పని ఒత్తిడి కొనసాగుతుందన్న సంగతి కోర్టు గుర్తుచేస్తూ, బీఎల్ఓల సంఖ్య పెంచాలని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870