దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రారంభంలో నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, ట్రేడింగ్ చివరికి బలంగా తిరిగి లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లోని షేర్లలో భారీగా కొనుగోలు నమోదై సూచీలు పుంజిపోయాయి. సెన్సెక్స్ (sensex) 513 పాయింట్ల లాభంతో 85,186 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 142 పాయింట్ల పెరుగుదలతో 26,052 వద్ద స్థిరపడింది. ఉదయం సెషన్లో సెన్సెక్స్ 84,643 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. కానీ రోజులో మధ్యలో కొంతమంది లాభాల్లోకి రావడంతో సూచీలు తిరిగి పైకి ఎగబాకాయి. నిఫ్టీ 25,850 మద్దతు స్థాయికి చేరి అక్కడి నుంచి 26,000 మార్కును తిరిగి దాటింది.
Read also: Gold Rate 19/11/25 : భారతంలో బంగారం ధర భారీ పతనం! 24 క్యారెట్ రూ.1.24 లక్షల దిగువకు…

Stock markets rebounded heavily… into profits
సూచీ 0.43 శాతం నష్టపోయింది.
విశ్లేషకుల ప్రకారం, కేంద్ర వాణిజ్య మంత్రికి సంబంధించిన సానుకూల వ్యాఖ్యలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వచ్చిన ఆశలు మార్కెట్ల పునరుత్తేజానికి కారణమయ్యాయి. ఈ ప్రభావంతో విలువ ఆధారిత కొనుగోళ్లు పెరిగాయి. రంగాల వారీగా పరిశీలిస్తే, నిఫ్టీ ఐటీ సూచీ 2.97 శాతం పెరిగింది. బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు కూడా లాభపడినవి. హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన స్టాక్స్ లాభపడ్డాయి. మరోవైపు టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. మిడ్-క్యాప్ షేర్లలో స్వల్ప కొనుగోళ్లు నమోదైనప్పటికీ, స్మాల్-క్యాప్ సూచీ 0.43 శాతం నష్టపోయింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: