రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా ప్రకటన ప్రకారం, రూ.2000 నోట్లను(Notes) వెనక్కి తీసుకునే ప్రక్రియ పూర్తికావడానికి ఇంకా సమయం ఉంది. ఇప్పటికీ రూ.6,181 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని RBI వెల్లడించింది.

రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం కీలక ప్రకటన చేసింది. వెనక్కి తీసుకున్న రూ.2వేల నోట్ల ఇంకా పూర్తిస్థాయిలో రిజర్వ్ బ్యాంక్కు చేరలేదని పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ 2016 నవంబర్ 8న రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బ్లాక్ మనీ, అవినీతి, నకిలీ కరెన్సీకి బ్రేకులు వేసేందుకు కేంద్ర నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. నోట్ల రద్దుతో వచ్చే కరెన్సీని కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం రూ.2వేల నోట్లను తీసుకువచ్చింది. మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో భాగంగా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో నోట్లను విడుదల చేసింది.
డిపాజిట్ చేసుకునే అవకాశం
దేశ అవసరాలకు సరిపడా ఇతర డినామినేషన్ల కరెన్సీ నోట్లు అందుబాటులో ఉండటంతో ప్రభుత్వం రూ.2వేల నోట్లను 19 మే 2023న ఆర్బీఐ రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వెనక్కి తీసుకున్న సమయంలో చెలామణిలో రూ.3.56లక్షల విలువ రూ.2వేల నోట్లు ఉన్నాయి. బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం 2023 అక్టోబర్ 7 వరకు ఛాన్స్ ఇచ్చింది. అయితే, ఆర్బీఐ ఆఫీసుల్లో ఈ నోట్లను మార్చుకుని తమ అకౌంట్లల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఇప్పటికీ అవకాశం ఉందని.. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కేంద్ర కార్యాలయాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉందని చెప్పింది.
Read Also :Arunachal Pradesh: జర భద్రం..కేంద్రమంత్రి సూచనలు