దేశంలోని వివిధ రైల్వే రీజియన్లలో(RRB Exams 2025) ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు(Exams) రేపటి నుంచి నవంబర్ 27 ప్రారంభం కానున్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుని, అభ్యర్థులు ఉపయోగించుకునే అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షలు నవంబర్ 27 నుంచి జనవరి 16 వరకు పలు కేంద్రాల్లో నిర్వహించబడతాయి. రైల్వే బోర్డు అభ్యర్థుల సౌలభ్యం కోసం ఉచిత ఆన్లైన్ మాక్ టెస్ట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్ సైన్-ఇన్ ద్వారా మాక్ టెస్ట్లు రాయవచ్చు. ఈ మాక్ టెస్ట్లు, అసలు పరీక్షను సులభంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి ఉపయుక్తంగా ఉంటాయి.
Read also: పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్

దేశ వ్యాప్తంగా 32,438 పోస్టులను భర్తీ చేయనుంది.
మూల షెడ్యూల్ (RRB Exams 2025) ప్రకారం, ఈ పరీక్షలు మొదట నవంబర్ 17 నుండి ప్రారంభమయ్యేలా ఉండగా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఈ రాత పరీక్షల ద్వారా దేశ వ్యాప్తంగా 32,438 గ్రూప్ డి లెవల్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా, రైల్వే బోర్డు హెల్ప్డెస్క్ 9513631887 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని ప్రకటించింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :