ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు(Nagarjuna) ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హక్కులకు (పర్సనాలిటీ రైట్స్) రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కృత్రిమ మేధ (ఏఐ),(A.I) డీప్ఫేక్ టెక్నాలజీలను ఉపయోగించి తన పేరు, స్వరం, ఫొటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవడాన్ని సవాల్ చేస్తూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Mallikarjun Kharge: అస్వస్థత కు గురైన మల్లికార్జున్ ఖర్గే.. ఆస్పత్రిలో చికిత్స?
అనుమతి లేకుండా వాడొద్దు: హైకోర్టు ఆదేశం
జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఆయన పేరును గానీ, స్వరాన్ని గానీ ఎలాంటి వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ఫేక్స్ వంటి టెక్నాలజీల(Technology) ద్వారా నాగార్జున గుర్తింపును దుర్వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెలబ్రిటీల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

న్యాయవాదుల వాదనలు, ఆందోళనలు
విచారణ సందర్భంగా నాగార్జున తరఫున సీనియర్ న్యాయవాదులు ప్రవీణ్ ఆనంద్, వైభవ్ గాగ్గర్ వాదనలు వినిపించారు. 95 చిత్రాల్లో నటించి, రెండు జాతీయ పురస్కారాలు అందుకున్న నాగార్జునకు సోషల్ మీడియాలో ఉన్న ప్రజాదరణను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన గుర్తింపుతో నకిలీ వాణిజ్య ప్రకటనలు, అశ్లీల కంటెంట్, టీ-షర్టుల అమ్మకాలు వంటివి చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, ఇలాంటి కంటెంట్ను ఏఐ మోడల్స్ శిక్షణకు ఉపయోగిస్తే భవిష్యత్తులో మరింత ప్రమాదమని న్యాయవాదులు వాదించారు.
నాగార్జునకు ఎక్కడ ఊరట లభించింది?
డీప్ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది.
కోర్టు జారీ చేసిన ప్రధాన ఉత్తర్వులు ఏమిటి?
ముందస్తు అనుమతి లేకుండా నాగార్జున పేరు, స్వరం లేదా ఫొటోలను ఎలాంటి వాణిజ్య ప్రకటనలకు ఉపయోగించరాదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: