हिन्दी | Epaper

Latest News: Rail Neer – రైల్లో అమ్మే వాటర్ బాటిళ్ల ధర తగ్గింపు

Anusha
Latest News: Rail Neer – రైల్లో అమ్మే వాటర్ బాటిళ్ల ధర తగ్గింపు

ప్రయాణికులకు భారతీయ రైల్వే మరో సంతోషకరమైన శుభవార్త అందించింది. ఇప్పటి వరకు రైళ్లలో విక్రయిస్తున్న తాగునీటి సీసాల ధరలను తగ్గిస్తూ రైల్వే బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ (IRCTC) ఆధ్వర్యంలో ‘రైల్ నీర్‌’ పేరుతో అందిస్తున్న ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల ధరలను సవరించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 అర్ధరాత్రి 12 గంటల నుంచే అమల్లోకి వస్తాయి.

ప్రస్తుతం రైళ్లలో, రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉండే ఒక లీటరు రైల్ నీర్‌ (Rail Neer) బాటిల్ ధర రూ.15గా ఉండగా, దానిని రూ.14కు తగ్గించారు. ఇదే విధంగా అర లీటరు సీసా ధర రూ.10 ఉండగా, దాన్ని రూ.9కు తగ్గించారు. అంటే ఒక సీసా కొంటే ఒక రూపాయి చొప్పున ప్రయాణికులకు ఆదా అవుతుంది. ఈ తగ్గింపు రైల్వే బోర్డు గుర్తింపు ఇచ్చిన కంపెనీలు తయారుచేసే బాటిళ్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టతనిచ్చారు.ప్రయాణంలో ఆరోగ్యంతో పాటు ఆదా..

మరింత తక్కువ ధరకే లభిస్తుంది

మినరల్ రిచ్ వాటర్ రైల్ నీర్ మరింత తక్కువ ధరకే లభిస్తుంది’’ అని ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. జీఎస్టీ శ్లాబు (GST slab)లను తగ్గింపుతోనే ‘రైల్ నీర్’ ధరలను రైల్వే సవరించింది. కొత్త జీఎస్టీ రేట్లతో చౌక ధరలకే ఎయిర్ కండిషనర్లు, సబ్ కాంట్రాక్ట్ పనులు, వస్తువుల రవాణా సేవలు వంటి ఇతర ఖర్చులను కూడా రైల్వేలు సమీక్షించాయి. వినియోగదారుల చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు సరఫరాదారు బిల్లులను ప్రాసెస్ చేసే సమయంలో అవసరమైన తనిఖీలు చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tgsrtc-festive-season-bus-fares-heavily-reduced/national/551544/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870