हिन्दी | Epaper

ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

sumalatha chinthakayala
ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నార్త్‌-ఈస్ట్‌ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్‌ నమోదుకాగా.. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్‌ రికార్డైంది. మధ్య ఢిల్లీలోని కరోల్ బాగ్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 39 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.

image

ఇక, మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటాయా లేక తలకిందులు చేస్తాయా అనేది తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతుండగా.. ప్రముఖంగా మాత్రం ఆప్-బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నయి. 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ.. తిరిగి సీఎం కుర్చీని దక్కించుకోవాలని చూస్తుండగా.. ఆప్ హ్యాట్రిక్ కొట్టాలని బలంగా కోరుకుంటోంది. మరోవైపు.. 2013 వరకు 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో ఈ ఎన్నికల్లో బోణీ కొట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయి అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

📢 For Advertisement Booking: 98481 12870