కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి మద్దతుగా అందించే పీఎం కిసాన్(PM Kisan) నిధులను విడుదల చేసింది. తమిళనాడులోని కొయంబత్తూరులోని ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.18,000 కోట్లకు పైగా మొత్తం జమ చేయబడనుంది.
Read Also: Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీతో మహిళ మృతి..
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని
2019 ఫిబ్రవరి 24న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వేలాది రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు కేంద్రం మొత్తం 20 విడుతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల(Farmers) ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం ప్రకారం అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది మూడు విడుతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. భూమి వివరాలు పీఎం కిసాన్ పోర్టల్లో నమోదు చేసుకుని, బ్యాంక్ ఖాతా ఆధార్కు లింక్ చేసిన రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: