PAN-Aadhaar Link: భారత ప్రభుత్వం పాన్ కార్డ్ను ఆధార్ కార్డుతో అనుసంధానించడం తప్పనిసరి అని వెల్లడించింది. దీని చివరి గడువు డిసెంబర్ 31, 2025. గడువు ముగిసిన తర్వాత లింక్ చేయని పాన్ కార్డులు జనవరి 1, 2026 నుండి పనిచేయవు.
Read also: Car Price: కార్ల ధరల పెంపుకు సిద్ధమైన కంపెనీలు

లింక్ చేయకపోతే ₹1,000 జరిమానా
లింక్ చేయకపోతే ₹1,000 జరిమానా విధించబడుతుంది. అలాగే, పాన్ ఆధార్ లింక్ కానివాటికి బ్యాంక్ లావాదేవీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, క్రెడిట్, పన్ను రిటర్న్ ఫైలింగ్ వంటి ఆర్థిక కార్యకలాపాల్లో సమస్యలు తలెత్తవచ్చు.
మీరు మీ పాన్-ఆధార్ లింక్ స్టేటస్ను www.incometax.gov.in వెబ్సైట్ లేదా SMS ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. SMS కోసం [ఆధార్ నంబర్] [పాన్ నంబర్] 567678/56161 ఫార్మాట్లో పంపాలి.
ప్రభుత్వం ఆన్లైన్ సౌకర్యాలు కూడా అందిస్తోంది. సమస్యలు ఎదురైతే ITD హెల్ప్లైన్(Helpline) లేదా సపోర్ట్ సెంటర్ ద్వారా సహాయం పొందవచ్చు. ఈ మార్పులతో పాన్ మరియు ఆధార్ అనుసంధానం సులభం అవుతుంది, పన్ను వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: