हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Pakistan: ఆఫ్ఘాన్ పై పాక్ దాడి.. తొమ్మిది మంది పిల్లలతో సహా పది మంది మృతి

Sushmitha
Telugu News: Pakistan: ఆఫ్ఘాన్ పై పాక్ దాడి.. తొమ్మిది మంది పిల్లలతో సహా పది మంది మృతి

అమాయకులైన చిన్న పిల్లలను పాక్ ఆర్మీ (Pak Army) పొట్టన పెట్టుకుంది. ఆఫ్ఘానిస్తాన్ (Afghanistan) లోని ఖోస్ట్రావిన్స్ పాక్ చేసిన దాడుల్లో ఒక నెల, పదహారు నెలలు ఉన్న పిల్లలు మృతి చెందారు. దీంతో ఆ ప్రావిన్స్ మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయింది. నిన్న అర్థరాత్రి పాక్ సైన్యం ఖోస్ట్రావిన్స్ పై విరుచుకుపడింది. వైమానిక దాడులు చేసింది.

Read Also: Prime Minister: సామాజిక‌, ఆర్థిక ప్ర‌గ‌తికి విధుల నిర్వ‌హ‌ణ కీలకం : ప్ర‌ధాని మోదీ

ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది సభ్యులు మరణించారు. వారిలో తొమ్మిది మంది పిల్లలే కావడం గమనార్హం. నిద్రపోతున్న ప్రజలపై పాక్ వైమానిక దాడులు చేసింది. వీరిలో 16నెలల మోహిబుల్లా, 3 ఏళ్ల హోజబుల్లా, 5ఏళ షంసుల్లా, ఎడేళ్ల అసదుల్లా తదితరులు ఉన్నారు. గుర్బుజ్ జిల్లాతో సహా భోస్ట్రావిన్స్ మొత్తం జనాభా సుమారు 648,000.

Pakistan
Pakistani attack on Afghan… Ten people including nine children killed

దాడులతో తమకు సంబంధం లేదు: పాక్

ఈ దాడులు తాము చేయలేదని, ఇందులో తమ ప్రమేయం లేదని పాకిస్తాన్ చెబుతోంది. తాము దాడి చేస్తే ఆ విషయాన్ని ప్రకటిస్తామని పాక్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చెప్పారు. అయితే పాకిస్తాన్ (Pakistan) తాము చేసిన పనిని ఒప్పుకోకపోవడం ఇదేమీ కొత్తకాదు. భారత్ పై చేసిన దాడులపై కూడా ఇలాగే ప్రకటన చేసింది. పైగా భారతే తమపై దాడి చేస్తోందని అహ్మద్ షరీఫ్ అన్నారు. ఇప్పటివరకు పాక్ ఆఫ్ఘానిస్తాన్ పై మూడుసార్లు దాడికి పూనుకుంది. ఈ దాడుల్లో దాదాపు 71 మంది పౌరులు మరణించారు. వీరంతా అమాయకులైన ఆఫ్ఘాన్లు అని ఆదేశ  అధికారులు అంటున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870