భారత్ మరోసారి పాకిస్థాన్ (India once again Pakistan)పై గగనతల నిషేధాన్ని కొనసాగించింది. ఇప్పటికే అమలులో ఉన్న నోటీసును (NOTAM) ఆగస్టు 23 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ (Minister Muralidhar Mohol) ఎక్స్లో (ట్విట్టర్) ప్రకటించారు.భారత గగనతలాన్ని పాకిస్థాన్ విమానాలకు అనుమతించకుండా నిషేధం పొడిగించడంపై మురళీధర్ స్పందించారు. “ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిషేధం కొనసాగుతోంది,” అని చెప్పారు. ఇది భారత భద్రతా ప్రోటోకాల్కి అనుగుణంగా ఉందని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ నిర్ణయానికి ప్రతిస్పందనగా భారత చర్య
గత వారం పాక్ ప్రభుత్వం భారతీయ విమానాలపై గగనతల నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు భారత ఎయిర్లైన్స్కు తమ గగనతలంలో ప్రవేశం లేదని పాక్ ప్రకటించింది. దానికి ప్రత్యుత్తరంగా భారత్ తన గగనతలాన్ని పాక్ విమానాలకు మూసివేసింది.పాకిస్థాన్ విధించిన నిషేధం కేవలం కమర్షియల్ విమానాలకే కాదు. భారత సైనిక విమానాలు కూడా పాక్ గగనతలంలోకి వెళ్లలేవు. ఈ నిషేధం ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు అమలులో ఉంటుందని పీఏఏ ప్రకటించింది.
ఉగ్రదాడి తర్వాత మొదలైన ఆంక్షలు
ఈ నెల 24 వరకు పాక్ విమానాలపై నిషేధం కొనసాగుతుంది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ వద్ద ఉగ్రదాడి జరిగింది. దాంతో భారత్ ఏప్రిల్ 30న ఈ నిషేధాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత జూలై 24 వరకు పొడిగించింది. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 23 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయాలతో భారత్-పాకిస్థాన్ మధ్య వైమానిక సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. గగనతల నిషేధాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను స్పష్టం చేస్తున్నాయి.
Read Also : IND Women vs ENG Women : వన్డే సిరీస్ టీమిండియాదే