हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి

Digital
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్ర స్థావరాలపై భారత్  దాడి

Operation Sindoor పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” విజయవంతమైంది. ఈ దాడికి ముందు 15 రోజుల క్రితం జరిగిన అమాయక పౌరులపై ఉగ్రదాడికి సమాధానంగా, తెల్లవారు జామున 1:44 సమయంలో భారత రక్షణ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై సమర్థవంతమైన క్షిపణి దాడులు చేపట్టాయి. ఈ దాడిలో బహవల్పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ రహస్య స్థావరం సహా 9 ప్రధాన ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి.ఈ స్థావరాల్లో లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు చెందిన శిక్షణా శిబిరాలు, లాంచ్ ప్యాడ్లు నాశనం అయ్యాయి. మర్కజ్ సుభాన్ అల్లా (బహవల్పూర్) 2015 నుంచి జెఇఎం ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉండి, పుల్వామా దాడి ప్రణాళికకు సంబంధించింది. ఈ ప్రాంతం నుండి మసూద్ అజార్ భారత వ్యతిరేక ప్రసంగాలు చేసి, యువతను జిహాదుకు ప్రేరేపించేవాడు.

 Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి

Operation Sindoor : పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” విజయవంతమైంది

మర్కజ్ తైబా (మురిడ్కే), లష్కరే తోయిబా సంస్థకు చెందిన అతి పెద్ద శిక్షణా కేంద్రం కాగా, ప్రతి సంవత్సరం వేల మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది. ఉసామా బిన్ లాడెన్ ఈ కేంద్ర నిర్మాణానికి భారీగా నిధులు సమకూర్చినట్లు సమాచారం. సర్జల్ / తెహ్రా కలాన్, మహ్మూనా జోయా (సియాల్ కోటి), మర్కజ్ అహ్లి హదీత్ (బర్నాలా) వంటి స్థావరాలు ఉగ్రదాడుల ప్రణాళికలతో ముడిపడినవి.అలాగే, మర్కజ్ అబ్బాస్, మస్కర్ రహీల్ షాహిద్, షావై నల్లా క్యాంప్ (ముజఫరాబాద్), మర్కజ్ సయ్యద్నా బిలాల్ వంటి శిబిరాలూ భారత భద్రతకు పెనుహానిగా మారాయి. ఈ స్థావరాలు 26/11 ముంబై దాడి వంటి చారిత్రక ఉగ్ర ఘటనలతోనూ సంబంధించాయి. ఈ 9 టార్గెట్లను సమర్థవంతంగా ఛేదించడం భారత రక్షణశాఖ యొక్క ప్రణాళికాత్మక విజయానికి నిదర్శనం.ఆపరేషన్ సిందూర్‌ను భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సమన్వయంతో నిర్వహించాయి. ఈ దాడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా పర్యవేక్షణ వహించారు. ఈ చర్య ద్వారా భారత ప్రభుత్వం దేశ భద్రతపై తన సంకల్పాన్ని, ప్రజల పట్ల బాధ్యతను స్పష్టంగా ప్రదర్శించింది.

Read More : Mock Drill : హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870