Telugu News: NDA Government: రబ్రీదేవి బంగ్లాను ఖాళీ చేయాలని నితీస్ సర్కార్ ఆదేశాలు

Read Time:  1 min
NDA Government
NDA Government
FONT SIZE
GET APP

ఇటీవల బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుటుంబానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన నితీష్ కుమార్ సర్కార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లాలూకు షాక్ ఇచ్చింది. బీహార్ మాజీ సీఎంగా పనిచేసిన రబ్రీదేవికి (Rabri devi) ప్రభుత్వం కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. 

Read Also: Kamala Pasand owner: పాన్ మసాలా యజమాని కోడలు దీప్తి ఆత్మహత్య

NDA Government
NDA Government Nitish Sarkar orders to vacate Rabri Devi bungalow

దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా లాలూ కుటుంబానికి అయ్యింది. గత 20 ఏళ్లుగా లాలూ కుటుంబానికి ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయమనడంతో వారు ఖంగుతిన్నారు.

పార్టీ ఓటమి నుంచి తేరుకోకముందే షాక్

ఎన్నికల్లో ఆర్జేడీ (RJD) ఘోరంగా ఓడిపోయింది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎంతో ధీమాతో ఉన్న లాలూ కుటుంబం ఓటమి పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా బంగ్లాను ఖాళీ చేయాలని భవన నిర్మాణ శాఖ మాజీ సీఎం రబ్రీదేవికి నోటీసులు జారీ చేసింది. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లాలూ కుటుంబంలో ఉన్న గొడవలే పార్టీ ఓటమికి ఓ కారణమని పార్టీశ్రేణులు అనుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.