हिन्दी | Epaper
బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Latest Telugu news : Mobile Congress : ఒక జీబీ వైర్‌లెస్‌ డేటా కప్పు టీ ధర కంటే తక్కువ.. ప్రధాని మోదీ

Sudha
Latest Telugu news : Mobile Congress : ఒక జీబీ వైర్‌లెస్‌ డేటా కప్పు టీ ధర కంటే తక్కువ.. ప్రధాని మోదీ

భారత్‌, ఆసియాలోనే అతిపెద్ద టెక్‌ ఫెయిర్‌గా గుర్తింపు పొందిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (IMC) బుధవారం ప్రారంభమైంది. బుధవారం నుంచి శనివారం వరకు న్యూఢిల్లీ యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది. మొబైల్‌ కాంగ్రెస్‌ (Mobile Congress)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని యువతరం సాంకేతిక విప్లవానికి గణనీయమైన కృషి చేస్తోందన్నారు. గతంలో భవిష్యత్తు అంటే వచ్చే శతాబ్దం.. రాబోయే 10-20 సంవత్సరాలు అని అర్థమని.. కానీ సాంకేతికత చాలా వేగంగా మారుతోందన్నారు. ఇప్పుడు మన భవిష్యత్తు ఇప్పుడు.. ఇక్కడే ఉందన్నారు. భారత్‌లో మొబైల్‌ డేటా చౌకగా ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఒక జీబీ వైర్‌లెస్‌ డేటా కప్పు టీ ధర కంటే తక్కువ ఖర్చు అవుతుందన్నారు. డేటా వినియోగం విషయానికి వస్తే భారతదేశం ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఒకటి.. దీని అర్థం డిజిటల్ కనెక్టివిటీ ఇకపై విలాసం, ప్రత్యేక హక్కు కాదన్నారు. కానీ, భారతీయ జీవితంలో అంతర్భాగంగా మారిందన్నారు. తాను ప్రదర్శనలోని కొన్ని స్టాళ్లను సందర్శించానన్న ఆయన.. తనకు భవిష్యత్తును చూపించాయన్నారు. టెలికాం కనెక్టివిటీ, 6జీ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీ సెమీకండక్టర్లు, డ్రోన్-స్పేస్ టెక్నాలజీ, డీప్-సీ, గ్రీన్-టెక్ మొదలైన సాంకేతిక రంగాల్లో రాబోయే కాలం పూర్తిగా భిన్నంగా ఉండబోతోందన్నారు. 6జీ టెక్నాలజీలో భారత్‌ ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తుందని తాను విశ్వసిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఇంటర్నెట్ వేగం, ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ ఇంటర్నెట్ వేగం కేవలం నెంబర్స్‌, ర్యాంకింగ్స్‌ గురించి మాత్రమే కాదన్నారు. మంచి ఇంటర్నెట్ వేగం జీవన సౌలభ్యాన్ని కూడా పెంచుతుందని మోదీ తెలిపారు. పెరిగిన ఇంటర్నెట్ వేగం కనెక్టివిటీని సులభతరం చేస్తుందని.. గతంలో పొందడం కష్టంగా ఉన్న హక్కులను సాధారణ పౌరులు పొందడంలో సాంకేతికత సహాయపడిందని.. టెలికాం రంగం ఇందులో ప్రధాన పాత్ర పోషించిందన్నారు.

Mobile Congress : ఒక జీబీ వైర్‌లెస్‌ డేటా కప్పు టీ ధర కంటే తక్కువ..  ప్రధాని మోదీ
Mobile Congress : ఒక జీబీ వైర్‌లెస్‌ డేటా కప్పు టీ ధర కంటే తక్కువ.. ప్రధాని మోదీ

కేబుల్ ఇంటర్నెట్ 2లక్షల గ్రామ పంచాయతీలకు చేరుకుందన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ (ATL) మిషన్ 10వేల ల్యాబ్‌ల ద్వారా 7.5 మిలియన్ల మంది పిల్లలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించిందని మోదీ తెలిపారు. ఈ రోజు సాంకేతిక సంస్థల్లో 100 యూజ్ కేస్ ల్యాబ్‌లను ప్రారంభించడం ఈ వృద్ధిని వేగవంతం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆసియాలో అతిపెద్ద టెక్, టెలికాం ఈవెంట్ అయిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (Mobile Congress ) ఆసియాలో అతిపెద్ద టెలికాం, మీడియా, టెక్నాలజీ ఈవెంట్ అని తెలిపారు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమ నిపుణులు, విధాన నిర్ణేతలు, టెక్ ఇన్నోవేటర్లు పాల్గొంటారు. నాలుగు రోజుల ఈవెంట్‌లో ఆప్టికల్ కమ్యూనికేషన్స్, సెమీకండక్టర్స్, క్వాంటం కమ్యూనికేషన్స్, 6జీ తదితర కీలక అంశాలపై ప్రదర్శనలు, చర్చలు సాగుతాయి. ఈ ఈవెంట్‌లో జపాన్, కెనడా, యూకే, రష్యా, ఐర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి ప్రతినిధులు సహా 800 మందికిపైగా స్పీకర్స్‌, 100కిపైగా సెషన్స్‌ ఉంటాయి.

మొబైల్ కాంగ్రెస్ అంటే ఏమిటి?

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 6G పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి మరియు ప్రపంచ భాగస్వామ్యాలను నడిపించడంపై దృష్టి పెడుతుంది, భారతదేశం యొక్క విశ్వసనీయ స్థానాన్ని ఉపయోగించుకుంటుంది . ఈ కార్యక్రమం AI-స్థానిక నెట్‌వర్క్‌లు మరియు స్పెక్ట్రమ్ సమన్వయంతో సహా కీలకమైన 6G ఇతివృత్తాలను చర్చించడానికి ప్రపంచ నిపుణులను సమావేశపరుస్తుంది.

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025?

టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) మరియు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2025 అక్టోబర్ 8 నుండి 11 వరకు “ఇన్నోవేట్ టు ట్రాన్స్‌ఫార్మ్” అనే థీమ్‌తో జరుగుతుంది, ఇది డిజిటల్ పరివర్తన కోసం ఆవిష్కరణలను ఉపయోగించుకోవడంలో భారతదేశం యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870