హోసూరులో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను తీసుకునే ప్రతి నిర్ణయం తాత్కాలిక ఫలితాల కోసం కాదు, తరతరాలకు మేలు చేసేలా ఉంటుంది. నా నిర్ణయాలు ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ (Man of Steel) లాంటి దృఢ నిశ్చయంతో ఉంటాయి” అని పేర్కొన్నారు.
హోసూరులో అంతర్జాతీయ విమానాశ్రయం
క్రమంగా పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉన్న కృష్ణగిరి జిల్లాలోని హోసూరులో 2,000 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా వ్యాపార, వాణిజ్య అవకాశాలు పెరిగి పెట్టుబడిదారులను మరింత ఆకర్షించే అవకాశం ఉందని తెలిపారు భారీ పెట్టుబడుల ఒప్పందాలు. ఈ సదస్సు వేదికగా రాష్ట్ర ప్రభుత్వం 92 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.24,307 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడుల ఫలితంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 49,353 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. పారిశ్రామిక, వాణిజ్యశాఖ (Department of Commerce) ఆధ్వర్యంలో 53 సంస్థలతో రూ.23,303 కోట్లకు, అలాగే ఎంఎస్ఎంఈ విభాగం ద్వారా 39 సంస్థలతో రూ.1,003.85 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.

MK Stalin
ఐటీ పార్క్ మరియు కొత్త పథకాలు
హోసూరులో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.400 కోట్ల వ్యయంతో ఆధునాతన ఐటీ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ ప్రాజెక్టు హోసూరును భవిష్యత్తులో ఐటీ హబ్గా మార్చే దిశగా కీలకపాత్ర పోషించనుంది. అంతేకాకుండా రూ.1,600 కోట్లతో నాలుగు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, వాటి ద్వారా సుమారు 8,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ పెట్టుబడులు
జర్మనీ, ఇంగ్లండ్ పర్యటనల సమయంలో రూ.15,516 కోట్ల పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించామని స్టాలిన్ (MK Stalin) తెలిపారు. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకే హోసూరులో పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయనపేర్కొన్నారు.హోసూరులో మార్పు గతంలో ఒక చిన్న పట్టణంగా ఉన్న హోసూరు, నేడు పారిశ్రామిక రంగంలో దేశ విదేశీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరిందని స్టాలిన్ (MK Stalin) గర్వంగా తెలిపారు. తమ నాలుగన్నరేళ్ల పాలనలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 77% ఇప్పటికే కార్యరూపం దాల్చాయని, ఇది ప్రభుత్వ పనితీరులో పారదర్శకతకు, పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Q1: హోసూరులో ఎలాంటి ప్రధాన ప్రాజెక్టును ప్రకటించారు?
A1: 2,000 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
Q2: హోసూరు పెట్టుబడిదారుల సదస్సులో ఎన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి?
A2: మొత్తం 92 కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: