Yuva Sathi scheme : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘యువ సాథి’ అనే పథకాన్ని ప్రకటించారు.
నిరుద్యోగులకు నెలకు ₹1500 సాయం
ఈ పథకం కింద 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు నెలకు ₹1500 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తెలిపారు. మార్చి 7 నుంచే ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు.
ఎవరికీ ఈ పథకం వర్తిస్తుంది?
ఈ స్కీమ్ 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులకు వర్తిస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. ముందుగా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ, మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగానే ప్రారంభిస్తున్నామని తెలిపారు.
Read Also: Israel Iran war : యుద్ధ భయం, స్నానం కోసం యాప్ వాడుతున్న ఇజ్రాయెలీలు?

నిరుద్యోగం తగ్గిందన్న మమతా
తమ ప్రభుత్వ హయాంలో బెంగాల్లో నిరుద్యోగం దాదాపు 40 శాతం తగ్గిందని మమతా పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మందికి స్కిల్ ట్రైనింగ్ అందించామని, వారిలో 10 లక్షల మందికి ఇప్పటికే ఉపాధి లభించిందని తెలిపారు.
రైతులకు ఇప్పటికే రూ.10 వేల సాయం
రాష్ట్రంలోని రైతులకు ప్రతి సంవత్సరం ₹10,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని మమతా గుర్తు చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్లో ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: