కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే బీహార్ (Bihar)అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ఓట్ల చోరీ చేయాలనే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ముట్టడించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

పాట్నాలో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో వ్యాఖ్యలు
బీహార్లో విపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో ఖర్గే ప్రసంగించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, “ప్రధాని మోదీ(pM Modi)కి చోరీ చేయడం ఒక అలవాటుగా మారింది. ఓట్లను, ప్రజాధనాన్ని దోచుకోవడంలో ఆయనకు అనుభవం ఉంది” అని విమర్శించారు.
అమిత్ షాతో కలిసి ప్రజలను అణచివేస్తున్నారు: హెచ్చరిక
ఖర్గే మాట్లాడుతూ, మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రజలను అణచివేయాలనే యత్నంలో ఉన్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే, బీహార్లో ప్రజాస్వామ్య బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఎన్డీఏ పాలనకు తెర పడే రోజులు దగ్గరలో
ఎన్డీఏ ఆధ్వర్యంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా, ముఖ్యంగా పేదలు, మహిళలు, దళితులు, వెనుకబడిన తరగతులకు మేలు చేసేలా ఉంటుందని చెప్పారు.
‘ఓటర్ అధికార్ యాత్ర’ను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, బీహార్ ప్రజలు వెనక్కి తగ్గలేదని ఖర్గే ప్రశంసించారు. ప్రజల మద్దతుతో యాత్ర విజయవంతమైందని పేర్కొన్నారు. ఇది ప్రజల చైతన్యానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
Read hindi news:hindi.vaartha.com
Read also