ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్ (Parliament) ఉభయసభలు దద్ధరిల్లాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఫలితంగా (Parliament) ఉభయసభలుఉభయసభల్లో గందరగోళం నెలకొన్నది. లోక్సభను కంట్రోల్ పెట్టేందుకు స్పీకర్ ఓంబిర్లా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో స్పీకర్ ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ పునఃప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. గందరగోళం కొనసాగింది. దాంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
Read Also : Employees: డీఏ–బేసిక్ పే విలీనం లేదన్న కేంద్రం

అంతకుముందు ప్రతిపక్ష సభ్యులు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఓట్లు దోచిపెట్టే పని చేస్తున్నదని విమర్శించారు.
లోక్ సభ మరియు రాజ్యసభ మధ్య తేడా ఏమిటి?
భారత పార్లమెంటు రెండు సభలతో కూడిన ద్విసభ; రాజ్యసభ (ఎగువ సభ అంటే రాష్ట్రాల మండలి) మరియు లోక్సభ (దిగువ సభ అంటే ప్రజల సభ). లోక్సభతో పోలిస్తే, రాజ్యసభలో తక్కువ మంది సభ్యులు ఉన్నారు మరియు దాని సభ్యులకు పరిమిత అధికారం ఉంటుంది.
భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఇల్లు ఏది?
చాలా విషయాలపై లోక్సభ అత్యున్నత అధికారాన్ని ఉపయోగిస్తుంది. i ఏదైనా సాధారణ చట్టాన్ని ఉభయ సభలు ఆమోదించాలి. తుది నిర్ణయం ఉమ్మడి సమావేశంలో తీసుకోబడుతుంది కానీ లోక్సభ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున లోక్సభ అభిప్రాయం ప్రబలంగా ఉంటుంది. ii ద్రవ్య విషయాలలో లోక్సభ ఎక్కువ అధికారాన్ని ఉపయోగిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: