స్థానిక సంస్థల ఎన్నికల్లో( Local BodyElections) మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, గెలిచిన మహిళా ప్రజాప్రతినిధుల అధికారాలను వారి భర్తలు లేదా ఇతర పురుష కుటుంబ సభ్యులు వినియోగిస్తున్న పరిస్థితులు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) గమనించింది. మహిళల పేరుతో పదవులు ఉన్నా, నిర్ణయాలు మాత్రం పురుషులే తీసుకుంటుండటంతో మహిళా సాధికారత భావన కేవలం పేరుకే పరిమితమవుతోందని కమిషన్ వ్యాఖ్యానించింది.
Read Also: TG: పంచాయతీ ఎన్నికలు: ఒక్క ఓటుతో తేలిన సర్పంచ్ విజయాలు

గ్రామ పంచాయతీలు( Local BodyElections), మున్సిపాలిటీల్లో చాలాచోట్ల మహిళా సర్పంచులు, అధ్యక్షులు విధుల్లో ఉన్నప్పటికీ వాస్తవ పరిపాలన ‘సర్పంచ్ పతి’ లేదా ‘ప్రాక్సీ పాలన’ రూపంలో నడుస్తోందని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఇది మహిళల రాజ్యాంగ హక్కులకు, సమానత్వానికి విఘాతం కలిగించే అంశమని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, మహిళా ప్రతినిధులు స్వతంత్రంగా విధులు నిర్వర్తించేలా తీసుకుంటున్న చర్యలపై వివరాలు ఇవ్వాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ సమస్యను నివారించేందుకు చేపట్టిన చట్టపరమైన చర్యలు, అవగాహన కార్యక్రమాలు, శిక్షణా ప్రణాళికలపై ఈ నెల 22లోపు సమగ్ర నివేదికలు సమర్పించాలని స్పష్టం చేసింది.
మహిళలకు కేవలం రిజర్వేషన్ మాత్రమే కాకుండా నిజమైన అధికార, స్వేచ్ఛా పాలన కల్పించాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రజాస్వామ్యంలో మహిళల పాత్ర బలపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: