ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో (In Ayodhya) రామమందిరం నిర్మాణం ముగిసిన తర్వాత భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆలయం చుట్టూ భూముల కొనుగోళ్ల ఉత్సాహం పెరగడంతో రియల్ ఎస్టేట్ రంగం జోరు అందుకుంది.అధికారుల సమాచారం ప్రకారం, ఆలయం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు 30 నుంచి 200 శాతం వరకు పెరిగాయి. గత ఎనిమిదేళ్లలో ఇలాంటి పెంపు జరగలేదు. దీంతో భవిష్యత్లో ఇక్కడ మదుపు చేసే వారికి మంచి అవకాశాలు కన్పిస్తున్నాయి.జూన్ 7నుంచి కొత్త సర్కిల్ రేట్లు అమలులోకి వచ్చాయి. ఫైజాబాద్ సబ్ రిజిస్ట్రార్ శాంతి భూషణ్ చౌబే (Shanti Bhushan Choubey) ఈ విషయాన్ని ప్రకటించారు. 2004లో మారిన ధరల తర్వాత ఇది పెద్ద మార్పుగా పేర్కొనవచ్చు.
క్వార్టర్ మీటరుకి రూ.27,900!
ఆలయానికి దగ్గరగా ఉన్న రాకాబ్ గంజ్, దేవ్ కాళి ప్రాంతాల్లో చదరపు మీటరుకి ధరలు రూ.26,600 నుంచి రూ.27,900కు పెరిగాయి. ఇది గతంలో రూ.6,650 నుండి రూ.6,975 మధ్యలో ఉండేది. ఈ పెంపు ఎంతో గణనీయమైంది.
మూడు విభాగాల్లో రేట్లు వేరుగా
నివాస భూములు, వాణిజ్య భూములు, వ్యవసాయ భూముల కేటగిరీల ప్రకారం వేర్వేరు ధరలు నిర్ణయించబడ్డాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రేట్లు అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
భూ యజమానులకు లాభం, కొనుగోలుదారులకు ఆలోచన
రియల్ ఎస్టేట్ వ్యాపారి వివేక్ అగర్వాల్ వ్యాఖ్యానిస్తూ, స్టాంప్ డ్యూటీ పెరగడం ఖాయం అయినా, భూముల అధికారిక విలువ పెరగడం వల్ల భూ యజమానులకు లాభమవుతుందని చెప్పారు.
Read Also : World Bank Report : భారత్, పాక్ ఆర్థిక పరిస్థితులపై బ్యాంకు ఏం చెబుతోంది?