हिन्दी | Epaper

Kishan Reddy : సింగరేణి అక్రమాలపై సీబీఐ? కిషన్ రెడ్డి సంచలన ప్రకటన!

Sai Kiran
Kishan Reddy : సింగరేణి అక్రమాలపై సీబీఐ? కిషన్ రెడ్డి సంచలన ప్రకటన!

Kishan Reddy : సింగరేణిలో నైనీ కోల్ బ్లాక్‌కు సంబంధించి అక్రమాలు జరిగాయన్న వార్తలపై కేంద్రమంత్రి G. Kishan Reddy తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బొగ్గు గనుల విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఆయన విమర్శించారు. సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని రెండు పార్టీలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ సంస్థలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని గంభీరంగా పరిశీలిస్తుందని తెలిపారు. నైనీ కోల్ బ్లాక్‌తో పాటు మొత్తం సింగరేణి వ్యవస్థలో పూర్తిస్థాయి ప్రక్షాళన చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రుల మధ్య వాటాల గొడవలే ఈ అక్రమాలు బయటపడటానికి కారణమయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: Google : తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

భారతదేశ బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ కీలక (Kishan Reddy) పాత్ర పోషిస్తోందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా దేశ పారిశ్రామిక అభివృద్ధిలోనూ సింగరేణి భాగస్వామ్యం అమూల్యమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు పోషించిన చారిత్రక పాత్రను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకప్పుడు లాభాల్లో ఉన్న సింగరేణి క్రమంగా ఆర్థిక, నిర్వహణ సమస్యల్లోకి వెళ్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యం పెరగడం వల్ల సంస్థ భవిష్యత్తే ప్రమాదంలో పడుతోందని విమర్శించారు. సింగరేణి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదని, ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని గుర్తు చేస్తూ, సంస్థ బలోపేతానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒడిశాలోని నైనీ వంటి కొత్త కోల్ బ్లాకుల కేటాయింపులో కేంద్రం చురుకుగా వ్యవహరిస్తోందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

రైళ్ల వేళల్లో మార్పు: ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక సూచన!

రైళ్ల వేళల్లో మార్పు: ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక సూచన!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

కేపీ ఓలీని ఓడించిన ర్యాపర్ ‘బాలెన్ షా’

కేపీ ఓలీని ఓడించిన ర్యాపర్ ‘బాలెన్ షా’

రూ.50 టికెట్‌కు రూ.30 లక్షలు కానీ విజేత ఎక్కడ?

రూ.50 టికెట్‌కు రూ.30 లక్షలు కానీ విజేత ఎక్కడ?

నిరుద్యోగులకు నెలకు ₹1500, మమతా బెనర్జీ ప్రకటన

నిరుద్యోగులకు నెలకు ₹1500, మమతా బెనర్జీ ప్రకటన

ఖాండ్వా జిల్లాలో వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

ఖాండ్వా జిల్లాలో వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

క్యాన్సర్‌ను జయించి UPSCలో ర్యాంక్, సంజయ్ సక్సెస్ స్టోరీ

క్యాన్సర్‌ను జయించి UPSCలో ర్యాంక్, సంజయ్ సక్సెస్ స్టోరీ

మమతా సర్కార్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం

మమతా సర్కార్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

సడెన్‌గా పెరిగిన బంగారం ధర, హైదరాబాద్‌లో తులం ఎంత?

సడెన్‌గా పెరిగిన బంగారం ధర, హైదరాబాద్‌లో తులం ఎంత?

పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష

పరీక్ష హాల్‌లో మొదలైన గొడవ.. ప్రాణం తీసిన కక్ష

📢 For Advertisement Booking: 98481 12870