భారతదేశంలో ఆధార్(Aadhaar) ఆధారిత గుర్తింపు పరిశీలనపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, సిమ్ కార్డ్ విక్రేతలు, పీజీ/హాస్టల్ మేనేజ్మెంట్ వంటి అనేక ప్రైవేట్ సంస్థలు ఇప్పటి వరకు ఆధార్ కార్డుల భౌతిక ఫోటోకాపీలను సేకరించి నిల్వ చేస్తూ వచ్చాయి. అయితే ఈ విధానం పౌరుల గోప్యతకు పెద్ద ముప్పు అని భావించిన UIDAI, భవిష్యత్తులో పేపర్ ఆధార్ కాపీలు తీసుకోవడం పూర్తిగా నిషేధించడానికి సిద్ధమైంది. ఈ కొత్త నిబంధనను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి PTIకి తెలిపారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) CEO భువనేష్ కుమార్ ప్రకారం.. ఆధార్ యొక్క ఆఫ్లైన్ ధృవీకరణను నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న అన్ని సంస్థలు తప్పనిసరిగా UIDAIతో నమోదు కావాల్సి ఉంటుంది.
Read Also: Venkatesh Prasad: KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం

భౌతిక ఆధార్ ఫోటోకాపీని ఇకపై అడగకూడదు
QR కోడ్, యాప్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను ఉపయోగించేలా మార్పులు చేయాలని అథారిటీ ఇప్పటికే ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ రూపొందించి ఆమోదించింది. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడుతుందని ఆయన వెల్లడించారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత.. హోటళ్లు, ఈవెంట్ హాళ్లు, ఫ్లైట్లు, రిటైల్ అవుట్లెట్లు వంటి ప్రదేశాల్లో ఒక వ్యక్తి గుర్తింపును నిర్ధారించడానికి భౌతిక ఆధార్ ఫోటోకాపీని ఇకపై అడగకూడదు. దాని బదులు UIDAI అందించే సెక్యూర్ API ద్వారా QR కోడ్ లేదా యాప్ ఆధారిత వెరిఫికేషన్ మాత్రమే అనుమతించబడు తుంది. ఈ మార్పు వెనుక ఉండే ప్రధాన కారణం, కాగిత కాపీల్లో నిల్వ అయ్యే వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యే ప్రమాదాన్ని పూర్తిగా తొలగించడం. కాగితం ఆధారిత ఆధార్ ధృవీకరణను నిరుత్సాహపరచడమే మా లక్ష్యమని UIDAI CEO చెప్పారు.
అమలులోకి రానున్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్
కొత్త యాప్-టు-యాప్ సిస్టమ్ సెంట్రల్ డేటాబేస్పై ఆధారపడదు, అందుకే సాంకేతిక సమస్యలు వచ్చినా కూడా ధృవీకరణ కొనసాగుతుంది. UIDAI ఒక కొత్త ఆధార్ ఆఫ్లైన్ వెరిఫికేషన్ యాప్ ను బీటా టెస్టింగ్ చేస్తోంది. ఈ యాప్ను విమానాశ్రయాలు, మద్యం & పొగాకు షాపులు, వయసు ధృవీకరణ అవసరమయ్యే రిటైల్ అవుట్లెట్లు, ఈవెంట్ వేదికలు వంటి ప్రదేశాలలో ఉపయోగించవచ్చు. వినియోగదారులు ఈ యాప్ ద్వారా చిరునామా రుజువులు అప్డేట్ చేయడమే కాక మొబైల్ ఫోన్ లేని కుటుంబ సభ్యులను కూడా జోడించగలరు. ఈ డిజిటల్ మార్పు, త్వరలో పూర్తిగా అమలులోకి రానున్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (DPDP Act) అమలు ప్రక్రియలో ఒక కీలక దశగా భావిస్తున్నారు. UIDAI ప్రకారం..పేపర్ కాపీలు నిల్వ చేయకపోవడం వల్ల డేటా లీకేజీ ప్రమాదం గణనీయంగా తగ్గిపోతుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: